నిండు ప్రాణాన్ని బలిగొన్న గోతులు
కోరుకున్న అమ్మాయిని మనువాడి కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. భార్య కుమారి అయిదు నెలల గర్భిణి. మరో నాలుగు నెలలు గడిస్తే తమ ప్రేమకు ప్రతి రూపం అయిన పండంటి బిడ్డ జన్మించే మధుర క్షణాల కోసం
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
అశోక్ (పాతచిత్రం)
పద్మనాభం, న్యూస్టుడే: కోరుకున్న అమ్మాయిని మనువాడి కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. భార్య కుమారి అయిదు నెలల గర్భిణి. మరో నాలుగు నెలలు గడిస్తే తమ ప్రేమకు ప్రతి రూపం అయిన పండంటి బిడ్డ జన్మించే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముంచుకురావడంతో బిడ్డను చూసే భాగ్యానికి నోచుకోకుండానే ఆ తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. పద్మనాభం-సింహాచలం మార్గంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం బి.సి.కాలనీకి చెందిన కుప్పిలి అశోక్ (27) కార్పెంటర్గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై మద్ది నుంచి ఆనందపురం వెళ్తుండగా మద్ది కూడలి దాటిన వెంటనే విశాఖ డెయిరీ బల్క్ కూలింగ్ సెంటర్ సమీపంలో రోడ్డుపై ఉన్న గోతులను తప్పించే క్రమంలో అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శిరస్త్రాణం (హెల్మెట్) ధరించి ఉన్నా బలమైన అంతర్గత గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుకు బలంగా తాకడంతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అశోక్ తల్లిదండ్రులు నర్సయమ్మ, తిరుపతిరావులకు ఇతను రెండో సంతానం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ వి.శ్రీనివాసరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ అప్పలరాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.