Suicide: కోడిగుడ్డు కూర వండలేదని యువకుడి ఆత్మహత్య
రాత్రి భోజనంలోకి కోడి గుడ్డు కూర చేయలేదని కోపగించుకున్న యువకుడు తల్లిపై కోపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రంగాయపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
మనోహరాబాద్, న్యూస్టుడే: రాత్రి భోజనంలోకి కోడి గుడ్డు కూర చేయలేదని కోపగించుకున్న యువకుడు తల్లిపై కోపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రంగాయపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మనోహరాబాద్ ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో చిన్న కొడుకు మములేశ్ (19) ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడగా భుజానికి గాయమైంది. దీంతో కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మములేశ్ తల్లి సుశీలను కోడిగుడ్డు కూర వండాలని కోరాడు. ఇంట్లో గుడ్లు లేవని ఇప్పుడు వండలేనని అమె చెప్పడంతో తల్లితో వాగ్వాదానికి దిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో అన్ని చోట్లా వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని మహంకాళి దేవాలయం దగ్గర పొలంలో చెట్టుకు కరెంటు తీగతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం