Crime News: ఓడిపోయా.. బతకాలని లేదు..!
‘అమ్మా...నాన్నా మళ్లీ మీ ముందు ఓడిపోయా...అందరి ముందూ ప్రశ్నగా మిగిలిపోయా... పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ ఆర్నెల్లు గడువు పెడితే తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చేయాలో అర్థంకాట్లేదు...
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
దంతాలపల్లి, న్యూస్టుడే: ‘అమ్మా... నాన్నా మళ్లీ మీ ముందు ఓడిపోయా... అందరి ముందూ ప్రశ్నగా మిగిలిపోయా...పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ ఆర్నెల్లు గడువు పెడితే తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చేయాలో అర్థంకాట్లేదు... నాకు బతకాలని లేదు’ అంటూ లేఖ రాసి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలెపల్లి వెంకన్న-శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శరణ్య(22) ఇంటర్మీడియెట్ చదివారు. కుట్టుమిషన్ నేర్చుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడ్ని ప్రేమించింది. ఆ యువకుడు ఓ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ, కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే క్రమంలో వీరి మధ్య సమస్య తలెత్తింది. దీంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆ యువకుడు పెళ్లి చేసుకునేందుకు మరో ఆరునెలలు గడువు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రేమించి మోసపోయి... ఓడిపోయానంటూ సదరు యువకుడి ఊహాచిత్రాన్ని గీసి లేఖ రాసిపెట్టింది. ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని లేఖను, ఆత్మహత్యకు వినియోగించిన చున్నీని స్వాధీనం చేసుకున్నారు.
యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన
యువతి మృతికి ప్రేమించిన యువకుడే కారణమంటూ, బాధిత కుటుంబానికి న్యాయం చేసి బాధ్యుడైన యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. యువతి మృతిపై తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మురళీధర్రాజు తెలిపారు. పరిస్థితిని సీఐ కరుణాకర్ పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు