Hyderabad News: సైబర్ దొంగలకు పోలీసుల ఝలక్!
సైబర్ నేరగాళ్లకే పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఓ పేమెంట్ గేట్వే సంస్థ సర్వర్ను హ్యాక్ చేసి కొట్టేసిన రూ.51 లక్షలతో పాటు ఆ మోసగాడి ఖాతాలో ఉన్న మరో రూ.49 లక్షలు.. మొత్తం రూ.కోటి ఫ్రీజ్ చేయించారు. బాధిత సంస్థ యాజమాన్యం సకాలంలో
నారాయణగూడ, న్యూస్టుడే: సైబర్ నేరగాళ్లకే పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఓ పేమెంట్ గేట్వే సంస్థ సర్వర్ను హ్యాక్ చేసి కొట్టేసిన రూ.51 లక్షలతో పాటు ఆ మోసగాడి ఖాతాలో ఉన్న మరో రూ.49 లక్షలు.. మొత్తం రూ.కోటి ఫ్రీజ్ చేయించారు. బాధిత సంస్థ యాజమాన్యం సకాలంలో ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీసీఆర్పీ)’లో ఫిర్యాదు చేయడంతోనే ఇది సాధ్యమైందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ కథనం ప్రకారం.. బంజారాహిల్స్లో ‘ఎక్స్ సిలికా సాఫ్ట్వేర్ సోల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్’ అనే ‘పేమెంట్ గేట్వే’ సంస్థ ఉంది. ఓ సైబర్ దొంగ ఇందులో ఖాతాదారుడిగా చేరాడు. సంస్థ సాఫ్ట్వేర్లోని లోపాలను పసిగట్టి, సర్వర్ను హ్యాక్ చేసి రూ.51 లక్షలు దోచేశాడు. అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే ఎన్సీసీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దోచిన సొమ్ము ఏ బ్యాంక్ ఖాతాలో జమా అయిందో తెలుసుకొని, ఆ ఖాతాను ఫ్రీజ్ చేయించారు. దీంతోపాటు అప్పటికే ఆ ఖాతాలో ఉన్న మరో రూ.49 లక్షలనూ ఫ్రీజ్ చేశారు. ఈ సొమ్ము కూడా ఇతరుల నుంచి కొట్టేసిందే అని చెబుతున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఓ గేట్వే సంస్థకు సంబంధించి రూ.1.20 కోట్లు కొట్టేశారు. సకాలంలో ఫిర్యాదు చేయకపోవడంతో ఆ సొమ్మును కాపాడలేకపోయామన్నారు. ఎవరైనా ఇలా సొమ్ము పోగొట్టుకుంటే ఎన్సీసీఆర్పీ నంబరు 155260లో, www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’