Hyderabad News: కారు నడిపింది ఎవరు?
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండున్నర నెలల పసికందు మృతికి కారకుడైన నిందితుడి...
రోడ్డు ప్రమాదంలో పసికందు మృతి.. సీసీ ఫుటేజీల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండున్నర నెలల పసికందు మృతికి కారకుడైన నిందితుడి జాడ కోసం ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రమాదంలో గాయపడిన మహారాష్ట్ర వాసి కాజల్ చౌహాన్ను పోలీసులు నిమ్స్లో చేర్పించగా.. ఆమె శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యింది. కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఎమ్మెల్యే షకీల్ ఒక వీడియోను విడుదల చేశారు. కారు ప్రమాదం తన బంధువు కుమారుడు చేశాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. తాను ఈ కారును అప్పడప్పుడూ వినియోగిస్తానని వివరించారు.
ఎమ్మెల్యే కుమారుడున్నాడా.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరున్నారని బాధితులు తెలిపారు. ఇందులో ఒకరు ఎమ్మెల్యే షకీల్ కుమారుడున్నాడన్న ఆరోపణలున్నాయి. బాధితులను ఢీకొనగానే.. అక్కడున్న వారు దాడిచేసే ప్రమాదం ఉందని..ఆ ఇద్దరూ కారు తాళాలు తీసుకుని పారిపోయారు. ఇప్పటికే సీసీ ఫుటేజీలు పరిశీలించి జూబ్లీహిల్స్ పోలీసులు కారులో ఉన్నది ఇద్దరని స్పష్టం చేసినా, వారు ఎవరన్నది ఇంకా చెప్పలేమని తెలిపారు. కారు అర్బన్ ఇన్ఫ్రా పేరుతో ఉందని, నిజామాబాద్లోని షోరూంలో కొనుగోలు చేశారని పోలీసులు తెలుసుకున్నారు.
ప్రాణానికి ఖరీదు కట్టారా.. నిమ్స్లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్ అక్కడి నుంచి అదృశ్యమైంది. ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు కాజల్తో మాట్లాడారని, చనిపోయిన శిశువు తిరిగి రాడని ఆమెకు నచ్చజెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతానికి రూ 2లక్షలు తీసుకుంటే శిశువు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని వివరించినట్టు సమాచారం. దీంతో ఆమె సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. ఓ పోలీసు అధికారి సహకారంతో ఈ రాజీ కుదుర్చుకొని వెళ్లింది.
పొట్టకూటి కోసం వచ్చి.. మహారాష్ట్రలో హైమోద గ్రామానికి చెందిన కాజల్ చౌహాన్ పొట్టకూటి కోసం రెండు నెలల పిల్లాడితో హైదరాబాద్కు వచ్చింది. ఇక్కడ తోడికోడలు సారిక చౌహాన్, ఆడబిడ్డ సుశ్మతో కలిసి ఉంటోంది. వీరు జూబ్లీహిల్స్లోని పలు కూడళ్లలో స్ట్రాబెర్రీ, బుడగలు విక్రయిస్తున్నారు. ఇలాగే గురువారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో విక్రయించి రహదారి మధ్య విభాగినిపై వీరంతా కూర్చొన్నారు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్ర థార్ వాహనం ఢీకొంది. కాజల్ చౌహాన్ చేతిలోని రెండున్నర నెలల పసికందు ఎగిరి రహదారిపై పడింది. కాజల్, సారిక, ఆమె చేతిలోని ఏడాది వయసున్న అశ్వతోష్, సుశ్మలు గాయపడ్డారు. పసికందు ప్రాణాలు కోల్పోయాడు. కాజల్ మినహా మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
కార్లు.. హైఎండ్ వాహనాలే లక్ష్యంగా తనిఖీలు
రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అధికంగా కార్లు, బస్సులు, హై ఎండ్ వాహనాలుంటున్న నేపథ్యంలో ఆయా వాహనాలే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించనున్నామని సంయుక్త కమిషనర్(ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ శుక్రవారం అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన ప్రమాదానికి కారణమైన కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్ రాలేదని, ఇలాంటివాటిని తనిఖీల్లో గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నలుపు తెరలు, హెడ్లైట్లు, సైలెన్సర్లు మార్చడం, నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. వాహనాలపై ఇష్టానుసారంగా ఎమ్మెల్యే/పోలీస్/ప్రెస్ అన్న స్టిక్కర్లను అతికించుకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ