Crime News: అపురూప వివాహం.. ‘అంతులేని విషాదం’
అపురూప వివాహమని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించిన వారి వివాహ జీవితంలో అంతులేని విషాదం అలుముకుంది. భర్త శంకరణ్ణ మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు- హాసన జాతీయ రహదారిలోని కుణిగల్ తాలూకా చౌడనకుప్పె గ్రామంలో
ఎలక్ట్రానిక్ సిటీ, తుమకూరు, న్యూస్టుడే : అపురూప వివాహమని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించిన వారి వివాహ జీవితంలో అంతులేని విషాదం అలుముకుంది. భర్త శంకరణ్ణ మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు- హాసన జాతీయ రహదారిలోని కుణిగల్ తాలూకా చౌడనకుప్పె గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శంకరణ్ణ ఉరి వేసుకోవడంపై అనేక సందేహాలు సుడులు సుడులుగా తిరుగుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. చౌడనకుప్పెకు చెందిన శంకరణ్ణ ఓ మోతుబరి రైతు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం ఉండేదికాదు. రైతుగా వివిధ పంటల్ని సాగుచేస్తూ బాగానే సంపాదించారు. నగరవాసులు సైతం ముక్కున వేలేసుకునేలా మంచి బంగళాను నిర్మించారు. వయస్సు మీదపడుతున్నా ఇంకా వివాహం చేసుకోలేందంటూ గ్రామస్థులు తరచూ హేళన చేసేవారు. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయమే తన ప్రధాన కర్తవ్యమనేలా వ్యవహరించేవారు. అలాంటి పరిస్థితుల్లో పొరుగు గ్రామమైన మావత్తూరుకు చెందిన మేఘనా అనే యువతి శంకరణ్ణను పరిచయం చేసుకుంది. అప్పటికే మేఘనాకు వివాహమైంది. భర్త ఇంటి నుంచి పారిపోయి రెండేళ్లైనా తిరిగి ఇంటికి రాలేదు. ఇక రాడని నిర్ధారించుకున్న మేఘనా తనను వివాహం చేసుకోవాల్సిందిగా శంకరణ్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. తనకు ఈ వయస్సులో పెళ్లేమిటని సున్నితంగా తిరిస్కరించినా ఆమె నుంచి ఒత్తిడి అధికమయ్యేసరికి చివరకు ఒప్పుకొన్నారు. పొరుగూరిలోని ఓ ఆలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెద్దాయనకు.. 25 ఏళ్ల యువతితో వివాహం అంటూ గ్రామస్థులే కాకుండా సామాజిక మాధ్యమాలు కూడా హేళన చేయడం ప్రస్తావనార్హం. ఆస్తి కోసమే ఈ వివాహమంటూ అనేక మంది విమర్శలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా శంకరణ్ణ తన భార్యను అపురూపంగా చూసుకునేవారు. ఇలాంటి సందర్భంలో అంతులేని విషాదం అలుముకుంది.
బెంగళూరులో కాపురమా..?: బెంగళూరులో కాపురం పెట్టాలని మేఘనా ఒత్తిడి చేసేదని శంకరణ్ణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉన్న ఆస్తిని విక్రయించి బెంగళూరులో స్థిరపడాలని ఆమె తరచూ పోట్లాడేదని వివరించారు. ఒకవైపు వృద్ధురాలైన తల్లిని కాదని భార్య మాటలు విని ఆస్తిని ఎలా విక్రయించాలని తీవ్రంగా మదనపడినట్లు తెలిసింది. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులిద్దరూ పోట్లాడినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. ఇంటి నుంచి కోపంగా బయటకు వెళ్లిన శంకరణ్ణ మంగళవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించారు. హులియూరు దుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శంకరణ్ణ శవం వద్ద ఓ లేఖను గుర్తించినట్లు తెలిసింది. అందులో ఏముందో దర్యాప్తులోనే వెల్లడికావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
వరంగల్ నగరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం