Hyderabad News: టెంపో డ్రైవర్ ఘటన..హైదరాబాద్ వచ్చిన గోవా పోలీసులు..
బోరబండ టెంపో డ్రైవర్ శ్రీనివాస్ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు గోవా పోలీసులు వచ్చారు.
హైదరాబాద్ : బోరబండ టెంపో డ్రైవర్ శ్రీనివాస్ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు గోవా పోలీసులు వచ్చారు. గత నెల 19న 10మంది ప్రయాణికులను టెంపో డ్రైవర్ శ్రీనివాస్ గోవాకు తీసుకువెళ్లారు. మరుసటి రోజు అదృశ్యమై మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో నగరానికి తిరిగివచ్చాడు. గోవాలో వెతికితే ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి అంజున పీఎస్లో ఫిర్యాదు చేశారు.
అయితే.. గోవాలో అదృశ్యమైన శ్రీనివాస్ ఇటీవల హైదరాబాద్ చేరుకున్నాక అతడ్ని చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తల, పొట్ట భాగంలో కుట్లు ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారేమోనని కుటుంబసభ్యులు అనుమానించారు. రెండ్రోజుల క్రితం అతడిని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ నిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం శ్రీనివాస్ నిమ్స్ నుంచి నిన్న డిశ్ఛార్జ్ అయ్యారు.
అతడికి ఇంట్రాకార్నికల్ ప్రెజర్వేషన్ పద్ధతిలో చికిత్స జరిగినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అతడి తలకు గాయమై ఉంటుందని.. అందుకే గోవాలో ఈ ఆపరేషన్ చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. బోరబండ ఎస్ఆర్ నగర్ పరిధిలో శ్రీనివాస్ ఉంటుండటంతో.. గోవాలోని అంజున పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శ్రీనివాస్ నివాసానికి వెళ్లనున్నారు.
అయితే ఈ ఘటనలో అసలు గోవాలో ఏం జరిగిందో తెలియాలని శ్రీనివాస్ కుటుంబసభ్యులు కోరుతున్నారు. అతడి చికిత్స కోసం ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. నిమ్స్లో బిల్లు కట్టలేక చికిత్స మధ్యలోనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్