Crime News: బంగారం విడిపించమంటే.. భార్యనే కడతేర్చాడు
కుదువపెట్టిన బంగారం విడిపించాలని పదేపదే అడిగిన భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఎన్టీపీసీ సమీపంలోని సంజయ్గాంధీనగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రెండ్రోజులకు వెలుగుచూసిన హత్యోదంతం
జ్యోతినగర్(కరీంనగర్), న్యూస్టుడే : కుదువపెట్టిన బంగారం విడిపించాలని పదేపదే అడిగిన భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఎన్టీపీసీ సమీపంలోని సంజయ్గాంధీనగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం సంజయ్గాంధీనగర్కు చెందిన సుందరగిరి రాజేష్ ఎలిగేడుకు చెందిన రక్షితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గతంలో భూపాలపల్లిలో పనిచేసిన కాలంలో రాజేష్కు అప్పులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఇక్కడికి వచ్చి గోదావరిఖని అడ్డగుంటపల్లిలో కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రాజేష్కు అప్పులు మరింత పెరిగిపోయాయి. అప్పులు తీర్చడానికి కొంతకాలం క్రితం తన భార్య రక్షిత(25) అలియాస్ కల్పన వద్ద ఉన్న 5 తులాల బంగారాన్ని కుదువపెట్టి డబ్బు తెచ్చుకొన్నాడు. పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇటీవల బంగారం విడిపించి తేవాలని రక్షిత పదేపదే కోరింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇంట్లో ఉన్న స్క్రూడ్రైవర్తో రక్షితను గొంతులో పొడిచి హతమార్చాడు. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వాసన రావడంతో సమీప కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా హత్యోదంతం బయటకు వచ్చింది. రక్షితకు రెండేళ్ల కుమారుడు ఉండగా, నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు స్వరూప్రాజ్, కుమార్, శరణ్య, లక్ష్మీప్రసన్న పరిశీలించారు. మృతురాలి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప 81వ బెటాలియన్లో చోటు చేసుకుంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు