Hyd News: భార్యాపిల్లల్ని వదిలెల్లి.. ఖరీదైన ప్రియురాలితో లబోదిబోమన్న బాధితుడు
ప్రియురాలి ఆకర్షణలో చిక్కిన ఓ ప్రబుద్ధుడు.. భార్యాపిల్లల్ని వదిలేసి ఆమెతో వెళ్లిపోయాడు. కొన్నినెలల తరువాత వాస్తవం బోధపడి.. కట్టుకున్న భార్యే ముద్దంటూ.. ఎలాగైనా తమను కలపాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
ఈనాడు, హైదరాభాద్: ప్రియురాలి ఆకర్షణలో చిక్కిన ఓ ప్రబుద్ధుడు.. భార్యాపిల్లల్ని వదిలేసి ఆమెతో వెళ్లిపోయాడు. కొన్నినెలల తరువాత వాస్తవం బోధపడి.. కట్టుకున్న భార్యే ముద్దంటూ.. ఎలాగైనా తమను కలపాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఆ భార్య మాత్రం ఇతగాడితో ఉండలేనంటూ తేల్చి చెప్పింది. కూకట్పల్లికి చెందిన భార్యభర్తలిద్దరూ ఉద్యోగులు. ఆర్థికంగా లోటు లేని జీవితం. ఇద్దరు పిల్లలతో సజావుగా సాగుతున్న సంసారం. గతేడాది భర్తకు ఓ వివాహితతో పరిచయమైంది. సెల్ఫోన్లో గంటలకొద్దీ మాటలు.. వాట్సాప్లో అర్ధరాత్రి దాటాక ఛాటింగ్లు.. వెరసి 2 నెలల క్రితం.. ఇద్దరూ ఎటో వెళ్లిపోయారు కూడా. భర్త కనిపించకపోవటంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అసలు విషయం బయటపడింది. తండ్రి ఎక్కడంటూ పిల్లలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె మౌనం వహిస్తుండేది. ఆ తరువాత.. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దిల్లీ వెళ్లాడంటూ చెబుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం అతడు.. అకస్మాత్తుగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తాను అదృశ్యమవ్వలేదని.. క్షణికావేశంలో తప్పు చేశానంటూ ఖాకీల కాళ్లావేళ్లా పడ్డాడు. ఏదోవిధంగా భార్యతో కలసి బతికేలా చూడమంటూ ప్రాధేయపడ్డాడు. అతనికి జ్ఞానోదయం కలగడానికి కారణమేంటా అని ఆరా తీయగా అతనిచ్చిన సమాధానం విని పోలీసు అధికారి విస్తుపోయారు. ప్రియురాలు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ ఖరీదైనవే కావాలనేదట. విలాసవంతమైన జీవితం అస్వాదించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టించటం ప్రారంభించింది. ఆహారం.. దుస్తులు.. వస్తువులు.. రోజువారీ గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు నెలరోజుల్లోనే రూ.10 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందంటూ భోరుమన్నాడట. ఆ ఖర్చులు భరించలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. పెద్దల ద్వారా భార్యతో రాజీ కుదుర్చుకుందామని ప్రయత్నిస్తే ఆమె ఛీకొట్టింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నాడు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి కలిపేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్