Crime News: మహానగరంలో మాయలేడి మోసాలు
కరోనాతో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు నానాపాట్లు పడుతున్నాయి. ఇదే అదనుగా పెద్దఎత్తున సొమ్ములు సంపాదించేందుకు ఒక మాయలేడి 15మందితో
15 మంది సభ్యుల ముఠాలో ఆరుగురి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్ - బాలాపూర్, న్యూస్టుడే: కరోనాతో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు నానాపాట్లు పడుతున్నాయి. ఇదే అదనుగా పెద్దఎత్తున సొమ్ములు సంపాదించేందుకు ఒక మాయలేడి 15మందితో ముఠా ఏర్పాటుచేసి పథకం వేసింది. కొంతకాలం మోసాలు సాఫీగా సాగినా చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి ముఠా సభ్యులతో సహా జ్రైలుపాలైంది.
అనుచరులకు డెమో తరగతులు
అగాపుర ప్రాంతానికి చెందిన చాంద్ సుల్తానా(55) సాధారణ గృహిణి. స్నేహితులు, బంధువుల నుంచి సొమ్ము తీసుకొని మరొకరికి అధిక వడ్డీలకు ఇస్తుండేది. అందులో నష్టాలు రావడం, అదనంగా తోడైన అనారోగ్య సమస్యలు, వైద్యఖర్చులు, రుణబాధల నుంచి బయటపడేందుకు పక్కా పథకం వేసింది. 15 మంది అనుచరులను రంగంలోకి దింపి సుల్తానా అతీంద్రియ శక్తులతో సొమ్ము నాలుగైదు రెట్లు అధికం చేస్తుందంటూ ప్రచారం చేయించింది. వీరిమాట నమ్మి వచ్చే బాధితులను చాలా తెలివిగా బురిడీ కొట్టించేవారు. అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలోనే పూజలు చేయాలని, అక్కడైతే మాత్రమే కోరికలు సిద్ధిస్తాయంటూ బుట్టలో పడేసేవారు. ఈ విషయంలో అనుచరులకు డెమో తరగతులు కూడా ఆమె నిర్వహించేదని పోలీసులు తెలిపారు. బాధితుడి నుంచి రూ.5000 తీసుకొని పూజలో ఉంచేవారు. ఆమె వచ్చి చేతి రుమాలు నుంచి రూ.50,000 తీసి పైకి విసిరేది. ఇంతలోనే అనుచరులు వచ్చి పోలీసులమంటూ హడావుడి చేసేవారు. బాధితులు సొమ్ము అక్కడే వదిలేసి పారిపోయేవారు. ఈ ముఠాపై మాదాపూర్, కుల్సుంపుర, నగర సీసీఎస్, రెయిన్బజార్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇలాగే రూ.11లక్షలను రూ.5కోట్లుగా మార్చుతుందని స్నేహితుడు మహేష్ చెప్పడంతో హస్తినాపురంవాసి శ్రీనివాసరెడ్డి ఈ నెల ఒకటిన రాత్రి విశ్వేశ్వరయ్య కాలనీలో పూజకు ఏర్పాట్లు చేశారు. రూ.11లక్షలు నగదు పూజలో ఉంచారు. రాత్రి 11 గంటల తరువాత ఆమె అనుచరులు వచ్చి కర్రలతో దాడి చేసి పూజలో ఉంచిన రూ.11లక్షలు, చాంద్సుల్తానాను తీసుకుని వెళ్లిపోయారు. బాధితుడు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ సారథ్యంలో ఏసీపీలు పురుషోత్తంరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు మహేందర్రెడ్డి, రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన సూత్రధారి చాంద్సుల్తానాతో సహా మహ్మద్ఖాన్, పి.వినోద్ ఎం.రాజు, డి.శ్రీనివాస్(45), ఇమ్రాన్(31)లను శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసు అధికారులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్