సమీప బంధువు భార్యతో సహజీవనం.. బంధువుల ఒత్తిడితో వ్యక్తి ఆత్మహత్య

సమీప బంధువు భార్యతో సహజీవనం చేస్తూ చుట్టాల నుంచి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి

Published : 07 May 2022 09:24 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సమీప బంధువు భార్యతో సహజీవనం చేస్తూ చుట్టాల నుంచి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్‌ సంజీత్‌(37) రెండేళ్లుగా న్యూబోయిన్‌పల్లి బాపూజీనగర్‌లో ఉంటూ ఓ రిహబిలిటేషన్‌ కేంద్రంలో పనిచేస్తున్నాడు. తన సమీప బంధువు భార్య(28)ను స్వగ్రామం నుంచి తీసుకొచ్చి బాపూజీనగర్‌లో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. గురువారం రాత్రి తమ్ముడు హరీంద్ర ఆకాశ్‌తో కలిసి మద్యం తాగాడు. ఇంటికొచ్చి ఉక్కపోతగా ఉందని బంగ్లా పైకి వెళ్దామని సహజీవనం చేస్తున్న మహిళతో చెప్పాడు. ఆమె బయటకు వెళ్లగానే లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఆమె హరీంద్రకు ఫోన్‌ చేసింది. అతను వచ్చి వెంటిలేటర్‌ నుంచి చూసేసరికి సంజీత్‌ కిటికీకి ఉరేసుకొని కనిపించాడు. హరీంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సహజీవనం విషయమై బంధువుల ఒత్తిడి ఎక్కువవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని