Crime News: నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మూడు మృతదేహాలు..
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ముగ్గురి మృతదేహాలు
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో మూడు మృతదేహాలు అనుమానాస్పందగా లభించాయి. ఎల్లారెడ్డి మండలం మౌలాన్ఖేడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను హైదరాబాద్ సూరారానికి చెందిన లింగమ్మ(40), సామిక(9), తీన(7)గా గుర్తించారు. ఈ నెల 5న శుభకార్యం కోసం కూతురితో కలిసి లింగమ్మ ఎల్లారెడ్డికి వచ్చింది. శుభకార్యం తర్వాత ముంభోజిపేట్లోని తమ్ముడి నివాసానికి వెళ్లింది. అయితే.. అదే సమయంలో గతంలో అప్పుగా తీసుకున్న వడ్డీ డబ్బులు ఇస్తానని లింగమ్మతో సోదరి చెప్పింది. ఆ తర్వాత లింగమ్మ, ఆమె కూతరు తీనతోపాటు తమ్ముడి కూతురైన సామికను ఆటోలో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో వీరి మృతదేహాలు కనిపించాయి. దీంతో ఈ ఘటనలో అక్కపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం