Road Accident: శుభకార్యానికి వెళ్లివస్తూ.. దంపతుల దుర్మరణం

జైపూర్‌ మండలం ఇందారం అటవీశాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ రామకృష్ణ, స్థానికుల

Updated : 09 May 2022 07:15 IST

జైపూర్‌, న్యూస్‌టుడే : జైపూర్‌ మండలం ఇందారం అటవీశాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ రామకృష్ణ, స్థానికుల వివరాల ప్రకారం.. మందమర్రికి చెందిన చందా మారుతి (42)- స్వప్న(40) దంపతులు. మంచిర్యాలలోని గౌతమినగర్‌లో నివాసముంటూ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కాగా ఆదివారం పెద్దపల్లిలో మారుతి సోదరి ఇంట్లో జరిగిన సారె కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి మంచిర్యాల వైపు వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనం.. అదే మార్గంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీని దాటే క్రమంలో అదుపుతప్పి లారీ చక్రాల కింద పడింది. దీంతో ఇద్దరి తల భాగాలు నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మారుతి వేలాల ఈవో రమేష్‌ సమీప బంధువులుగా గుర్తించారు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్‌ఐ వివరించారు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ రాజు వెంటనే ప్రమాదస్థలికి తరలివచ్చారు.మృతులిద్దరికి కారు, బస్సుల్లో ప్రయాణం సాగించడం అలవాటు లేకపోవడంతో.. ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చిన ద్విచక్రవాహనం మీదనే వెళ్తారని బంధువులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని