Crime News: మీ వయసెంతైనా సరే.. పెళ్లాడతా
‘‘నాపేరు ఇందుషా తుమ్మల.. మాది విజయవాడ. డిగ్రీ చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లికాలేదు. ఫేస్బుక్ ద్వారా మీరు పరిచయమయ్యాక మిమ్మల్ని పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్నాను. మీ వయస్సు నాకంటే రెట్టింపైనా నాకు అభ్యంతరం లేదు.
వ్యాపారికి వలపు వల విసిరి రూ.45లక్షలు స్వాహా
నూజివీడు వాసి అరెస్ట్
నిందితుడు మోతే అశోక్
ఈనాడు, హైదరాబాద్: ‘‘నాపేరు ఇందుషా తుమ్మల.. మాది విజయవాడ. డిగ్రీ చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లికాలేదు. ఫేస్బుక్ ద్వారా మీరు పరిచయమయ్యాక మిమ్మల్ని పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్నాను. మీ వయస్సు నాకంటే రెట్టింపైనా నాకు అభ్యంతరం లేదు. ఏదైనా దేవాలయానికి వెళ్లి ఇద్దరం ఒక్కటవుదా’’మంటూ యువతిలా పరిచయం చేసుకుని.. అమ్మాయిలా మాట్లాడి జూబ్లీహిల్స్లో ఉంటున్న ఓ వ్యాపారి నుంచి రూ.45లక్షలు కాజేసిన నిందితుడు మోతే అశోక్ను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను బుధవారం సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మోతే అశోక్ ఫేస్బుక్లో అందమైన యువతి పేరుతో ఖాతా తెరిచి జూబ్లీహిల్స్ వ్యాపారిని రెండేళ్ల క్రితం పరిచయం చేసుకున్నాడని, దశలవారీగా అతడి నుంచి రూ.45లక్షలు తీసుకున్నాడని, వ్యాపారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మోసం బహిర్గతమైందని వివరించారు.
యూట్యూబ్ చూసి.. వాయిస్యాప్ వాడి
నూజివీడులో నివాసముంటున్న అశోక్ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేశాడు. చెడు అలవాట్లకు బానిసై డబ్బు కోసం మోసాలు చేయాలనుకున్నాడు. ఎలా మోసం చేయాలని యూట్యూబ్లో వీడియోలు చూశాడు. ఓ యువతి ఫొటోను డౌన్లోడ్ చేసుకుని ఇందుషా తాళ్లూరి పేరుతో 2020 ఫిబ్రవరిలో ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. జూబ్లీహిల్స్ వ్యాపారికి రిక్వెస్ట్ పంపాడు. ఫేస్బుక్ పరిచయం తర్వాత వ్యాపారితో ‘‘వాయిస్ ఛేంజ్’ యాప్ ద్వారా యువతిలా మాట్లాడాడు. విజయవాడకు వస్తే ఏకాంతంగా గడుపుదామంటూ ఆహ్వానించేవాడు. వచ్చేవారంలో వస్తున్నానని వ్యాపారి అంటే.. వేరే పనులున్నాయంటూ దాటవేసేవాడు.
ఫీజు కట్టాలి.. అమ్మకు కరోనా అంటూ..
వ్యాపారి తన మాటలకు ఆకర్షితుడయ్యాడని తెలుసుకున్న అశోక్ కళాశాలలో ఫీజు కట్టాలంటూ రూ.3లక్షలు తీసుకున్నాడు. తొలి దశలో తన తల్లికి కరోనా సోకిందని, డబ్బు సాయం చేయాలంటూ రూ.10లక్షలు, రెండోదశ తనకు కూడా సోకిందని రూ.15లక్షలు తీసుకున్నాడు. తరచూ డబ్బు కోసం ఫోన్ చేస్తుండడంతో బాధితుడికి అనుమానం వచ్చి 20 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుణ్ని గుర్తించారు. నూజివీడుకు వెళ్లి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అశోక్ ఆన్లైన్ గేమింగ్ యాప్లు, మద్యం తాగేందుకు రూ.43లక్షలు ఖర్చుచేశాడని ఇన్స్పెక్టర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?