Crime News: బాలుర మధ్య చిచ్చురేపిన ప్రేమ.. ఇద్దరు కలిసి ఒకరిపై కత్తితో దాడి

బాలుర మధ్య రేగిన ప్రేమ వివాదంలో ఒకరు గాయాలకు గురైన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ్‌సింగ్‌ తెలిపిన వివరాలమేరకు..

Updated : 18 May 2022 05:23 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: బాలుర మధ్య రేగిన ప్రేమ వివాదంలో ఒకరు గాయాలకు గురైన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ్‌సింగ్‌ తెలిపిన వివరాలమేరకు.. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో నివసించే ముగ్గురు బాలురు(17), (16), (17) ఇంటర్‌ చదువుతున్నారు. వారిలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వారిద్దరూ మరో బాలుడితో కలిసి అత్తాపూర్‌లోని మూసీకాలువ వద్దకు వచ్చారు. అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో గొడవ జరిగింది. దీంతో ముందే ప్రణాళిక వేసుకున్న ఇద్దరు కలిసి మరో బాలుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో పొడవబోయేసరికి బాలుడు అరవడంతో ఇద్దరూ పరారయ్యారు. సదరు బాలుడికి గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న లంగర్‌హౌస్‌ పోలీసులు ఉస్మానియాకు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోది కావడంతో వారికి సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించి గొడవకు ప్రేమ వ్యవహారం కారణం అని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని