తెనాలిలో క్రికెట్ బుకీ అరెస్టు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో ..
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు
తెనాలి టౌన్, న్యూస్టుడే: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఉప్పుబజార్లో ఉన్న ఓ ఇంటిలో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్ నమోదుల ప్రధాన బుకీ జి.వెంకట్, అతని సహాయకుడు వెంకటేష్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్ట్యాప్, 8 స్మార్ట్ఫోన్లు, 9 కీప్యాడ్ ఫోన్లను కలిగి ఉన్న లైన్ బాక్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన వెంకట్ గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాల విశ్లేషణ తర్వాత ఇందులో ఎంత మంది పాల్గొన్నారు? వారు ఎవరు? ఏమేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి.. తదితర సమాచారాన్ని సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వన్టౌన్ పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, చాణక్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రధాన నిందితుడు వెంకట్ బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ అతని సిబ్బంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పక్కా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్