బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణం
స్థానికంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం,
బొల్లి దివ్యవాణి
గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), సిరిసిల్ల గ్రామీణం, న్యూస్టుడే: స్థానికంగా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి ఎస్సై డి.వెంకటకొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం, మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసేవారు. ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్ బ్యాంక్ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ.40లక్షల రుణం తీసుకున్నారు. ఆ రుణంతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకొని ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసించేవారు. బ్యాంకులో పనిఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు తెలపగా వారు ఆమెను సముదాయించి పంపారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేశాయి. శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న వ్యక్తి చూసే సమయానికి ఓ గదిలో సీలింగ్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి తండ్రి లక్ష్మీనారాయణ, అన్న రామకృష్ణ ఉన్నారు.
సిరిసిల్లలో విషాదం
సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన బొల్లి లక్ష్మినారాయణ-విమల దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, రామకృష్ణ, ఒక కూతురు దివ్యవాణి సంతానం. లక్ష్మినారాయణ సాంచలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి విమల బీడీ కార్మికురాలు. ఇద్దరు కుమారులకు వివాహమైంది. పెద్ద కుమారుడు సిరిసిల్లలోనే టైలరింగ్ చేయగా, చిన్నకుమారుడు సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తూ సిరిసిల్లలోనే ఉంటున్నాడు. దివ్యవాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. -
సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి
వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా రాహిల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. -
హోటల్ దగ్ధం.. నర్సింగ్ విద్యార్థిని సజీవ దహనం
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు ఎగిసిపడి హోటల్ కాలి యువతి సజీవ దహనమయ్యారు. -
ఎస్సై దాష్టీకాలకు తాళలేక.. చెక్పోస్టు చిరుద్యోగి ఆత్మహత్య
ఎస్సై ఒత్తిళ్లు, వేధింపులకు తాళలేక ఓ చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న దారుణమిది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గుండ్లపాలేనికి చెందిన పోకూరి సురేష్బాబు(38) వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని తెట్టు చెక్పోస్టులో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
కబడ్డీ నేర్పిస్తామని నమ్మించి ఎస్సీ బాలికపై అత్యాచారం
కబడ్డీ ఆటలో మెలకువలు చెబుతామంటే నమ్మి వారి వద్దకు వెళ్లిన ఓ ఎస్సీ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
విద్యాదీవెన డబ్బులు రాక.. కుమార్తె హాల్టికెట్ కోసం తల్లి ఆత్మహత్యాయత్నం
జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. -
సిద్ధం సభకు రాయితో వచ్చిన వైకాపా కార్యకర్త
కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా కార్యకర్త ఒకరు రాయితో రావడం కలకలం సృష్టించింది. -
అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థి మృతి
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్(12) మంగళవారం రాత్రి మృతిచెందాడు. -
పరీక్షలకు అనుమతించలేదని... ఆర్జీయూకేటీలో విద్యార్థి బలవన్మరణం
పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది. -
దద్దరిల్లిన బస్తర్
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది.
తాజా వార్తలు (Latest News)
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్
-
ప్రచారానికి తెర.. లోక్సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
-
మోదీ విమర్శలు.. రాహుల్ గాంధీ యూటర్న్
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM