Crime News: యువతికి పెళ్లయినా.. యువకుడు రెండేళ్లు చిన్నోడైనా ప్రేమించుకొని..
ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు.. ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు.. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఆమె పెళ్లయినా, రెండేళ్లు పెద్దయినా.. చాటుమాటుగా కలిసి తిరుగుతున్నారు. విషయం తెలిసి, కుటుంబంలో కలతలు పెరిగి,
జగదేవపూర్, న్యూస్టుడే: ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు.. ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు.. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఆమె పెళ్లయినా, రెండేళ్లు పెద్దయినా.. చాటుమాటుగా కలిసి తిరుగుతున్నారు. విషయం తెలిసి, కుటుంబంలో కలతలు పెరిగి, జీవితం శాశ్వతంగా పంచుకోలేమని భావించిన ప్రేమ జంట ఆత్మహత్మ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్నగర్కు చెందిన వెంకవ్వ, దశరథం దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గతంలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకుమారుడు నామ వేణుగోపాల్ (24) ఇదే పట్టణానికి చెందిన మచ్చ పూజ (26) ఇద్దరూ స్థానికంగా గోపాల్నగర్లోని ఓ ప్రైవేటు క్లినిక్ రిసెప్షన్లో పని చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆమెకు నాలుగేళ్ల క్రితం మేనబావ అజయ్తో పెళ్లి చేశారు. భర్తతో ఆమె సఖ్యతగా ఉండటం లేదు. అవివాహితుడైన వేణుగోపాల్తో తరచుగా కలిసి తిరుగుతోంది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ఆమె ఇంటికి రోజుమాదిరి తిరిగి రాకపోవటంతో సిరిసిల్ల పోలీసు స్టేషన్లో భార్య అదృశ్యమైందని మే 16న భర్త ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి, మనస్తాపానికి గురైన జంట ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్పై వచ్చారు. ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. ఆయా కుటుంబాల్లో విషాదం నింపారు. జంట ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?