ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మనోహరాబాద్ మండలం కూచారం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ డేవిడ్రాజ్ తెలిపిన వివరాలు..
మనోహరాబాద్, న్యూస్టుడే: ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మనోహరాబాద్ మండలం కూచారం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ డేవిడ్రాజ్ తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూర్ గ్రామానికి చెందిన సత్తయ్య, రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 20 ఏళ్ల కిందట మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి ఉపాధి నిమిత్తం వచ్చారు. సత్తయ్య ట్రాక్టరు డ్రైవరు కాగా, రేణుక పరిశ్రమలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు, కూతురికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు హరీశ్ (21) తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు వివాహం జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్ గురువారం ఉదయం 9 గంటల సమయంలో కూచారం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన పలువురు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రైల్వే పోలీసులకు విషయం తెలియజేయగా వారొచ్చి పరిశీలించగా.. హరీశ్ అని తేలింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం గాంధీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని హెడ్కానిస్టేబుల్ వివరించారు.
ఆర్థిక ఇబ్బందులతో..
మోమిన్పేట: ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోమిన్పేట ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ప్రకాష్ తెలిపిన వివరాలు.. మోమిన్పేటకు చెందిన బేగరి మహిపాల్(28) బుధవారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని భార్య శిరీషతో చెప్పి వెళ్లాడు. కొంతసేపటి తరువాత శిరీష తన మరిది అనిల్ చరవాణితో ఫోన్ చేయగా బస్టాండ్ దగ్గరే ఉన్నాను వస్తున్నానని చెప్పాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తెలిసిన వారి వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం కాస్లాబాద్ సమీపంలోని నందివాగు ప్రాజెక్టు పరిసరాల ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నట్టు గుర్తించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పులు ఉన్నాయని తరచూ బాధపడుతుండేవాడని శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
జీవితంపై విరక్తితో..
గడ్డపోతారం(జిన్నారం): జీవితంపై విరక్తితో ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిన్నారం మండలం గడ్డపోతారంలో చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారం పోలీసుల కథనం ప్రకారం... గడ్డపోతారం శివారులోని విశ్వనాథ్ వెంచర్లో అద్దె ఇంట్లో ఉండే ఉత్తర్ప్రదేశ్కు చెందిన మన్ను అన్సారీ(24) కొంత కాలంగా పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతిచెందాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?