Andhra News: స్నేహితుడని క్రెడిట్ కార్డులిస్తే.. రూ.50 లక్షలకు టోకరా
స్నేహితుడిని నమ్మి క్రెడిట్ కార్డులనిస్తే రూ.50 లక్షలు మోసానికి పాల్పడ్డ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. ప్రసాదంపాడుకు చెందిన వాడవల్లి
కృష్ణలంక, న్యూస్టుడే: స్నేహితుడిని నమ్మి క్రెడిట్ కార్డులనిస్తే రూ.50 లక్షలు మోసానికి పాల్పడ్డ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. ప్రసాదంపాడుకు చెందిన వాడవల్లి సాయి స్వప్నకుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇంటి వద్దనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన యర్రంశెట్టి వీరవెంకట నాగకిరణ్ 2018లో పలు బ్యాంకులకు చెందిన 15 క్రెడిట్ కార్డులను స్వప్నకుమార్ నుంచి తీసుకున్నారు. వాటిని నాగకిరణ్.. తన స్నేహితులైన యడ్ల వసుధ, ఆమె కుమారులు ఉదయ్కుమార్, క్రాంతి కుమార్లకు ఇవ్వగా.. ఆ కార్డులు ఉపయోగించి వారు విదేశీ కళాశాలలకు ఫీజులు చెల్లింపులు చేపట్టారు. వారితో పాటు నాగకిరణ్ స్నేహితులైన రాజ్యలక్ష్మి, విజయ్కుమార్లు కూడా తమ అవసరాలకు రూ.9 లక్షలు ఈ కార్డుల ద్వారా వాడుకున్నారు. ఇలా పలు దఫాలుగా ఈ కార్డుల ద్వారా తీసుకున్న మొత్తం రూ.50 లక్షలకు చేరింది. మరోపక్క తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుల రికవరీ టీం సభ్యులు స్వప్నకుమార్పై ఒత్తిడి చేయసాగారు. దీంతో చెల్లింపు చేపట్టాల్సిందిగా అతడు నాగకిరణ్ను అడగ్గా రెండేళ్లుగా తాత్సారం చేస్తున్నాడు. దీంతో బాధితుడు స్వప్నకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి నాగకిరణ్ తల్లి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించగా ఆమె తనకేమీ తెలియదని ఇద్దరూ మాట్లాడుకోవాల్సిందిగా సూచించారు. ఇద్దరికి స్నేహితుడైన వేరొకరి ద్వారా అడిగితే నాగకిరణ్ విజయవాడలో ఎవరికైనా తన గురించి చెప్పుకోవచ్చని, తనకు జైలు కొత్త కాదని, తనపై ఎటువంటి కేసైనా పెట్టుకోవచ్చంటూ బెదిరిస్తూ మాట్లాడాడు. దీంతో బాధితుడు స్వప్నకుమార్ ఈ నెల 22న స్పందన కార్యక్రమంలో సీపీకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు పటమట పోలీసులు నిందితుడు నాగకిరణ్పై బెదిరింపు, మోసం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM