మాయలేడీ లీలలెన్నో..
ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డ మాయలేడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగుల్ని నిండా ముంచడమే కాకుండా రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి ఉద్యోగుల నుంచి భారీగా దండుకున్నట్లు తేలింది. రూ.5
రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ భారీ టోకరా
ఈటీవీ, ఖమ్మం
ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డ మాయలేడీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగుల్ని నిండా ముంచడమే కాకుండా రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి ఉద్యోగుల నుంచి భారీగా దండుకున్నట్లు తేలింది. రూ.5 లక్షలకు తగ్గకుండా అప్పు ఇచ్చిన వారికి అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తానంటూ డబ్బున్న వారి నుంచీ భారీగానే సొమ్ము కూడబెట్టింది. ఆమె మోసాలకు బలైన బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలోనే కాదు హైదరాబాద్ వరకూ బాధితులున్నట్లు తెలుస్తోంది. భర్త పోలీసు ఉద్యోగన్న ధీమాతోనే మోసాల పరంపర కొనసాగించినట్లు పోలీసులు భావిస్తున్నప్పటికీ.. భర్తకు తెలిసి జరిగిందా? లేదా? అన్నది తేలలేదు. ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ కథనంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం.. నిందితురాలుతోపాటు ఆమె భర్తనూ శుక్రవారం ఠాణాకు తీసుకొచ్చి ప్రశ్నించారు.
బాధితులెందరో..
ఉద్యోగాల పేరిట రూ.కోటికిపైగా దండుకున్న ఆమె రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని డబ్బున్న ఉద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలింది. వైరాలోని పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది ఇద్దరు ఇలా మోసపోయారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసింది. ఇంకా ఆసక్తి ఉన్న వారి నుంచీ పెట్టుబడులు పెట్టేలా చూడాలని వారిద్దరినీ కోరగా తమ బంధువులు, స్నేహితుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు ఇప్పించారు. ఇలా ఒక్క వైరా నుంచే రైల్వే కాంట్రాక్టుల పేరిట రూ.80 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఖమ్మం, తిరుమలాయపాలెంతోపాటు హైదరాబాద్ నుంచి మహిళ ఉచ్చులో పడ్డ బాధితులున్నారు. ఆమె చేతిలో మోసపోయిన పలువురు బాధితులు శుక్రవారం ఠాణాకు వచ్చినట్లు తెలిసింది. తామే కాకుండా తమకు తెలిసిన వారు స్నేహితులు, బంధువుల కుటుంబీకులతో డబ్బులు ఇప్పించామని.. వారు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. ఎలాగైనా డబ్బు ఇప్పించాలని పోలీసులను కోరినట్లు తెలిసింది.
పోలీసుల ప్రశ్నల వర్షం
బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి భర్త హైదరాబాద్ పోలీస్శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించి ఆయన్ను ఠాణాకు తీసుకొచ్చారు. శుక్రవారం ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ నేర ప్రవృత్తిపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. గతంలోనూ పలు స్టేషన్లలో మహిళపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగాలు, కాంట్రాక్టుల పేరిట మొత్తం ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు? బాధితులంతా ఎక్కడెక్కడి వారు? మహిళ వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణాల్లో విచారణ జరిపినట్లు తెలిసింది. ఇక పోలీసు శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె భర్తపైనా అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఆయకు తెలియకుండానే ఈ మోసాలకు పాల్పడిందా అన్న కోణంలో విచారించారు. భార్య చేసిన మోసాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని భర్త చెప్పినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ