Hyderabad News: ‘ఫోన్ నంబర్ ఇవ్వకుంటే ఎత్తుకెళ్లి.. గ్యాంగ్రేప్ చేస్తాం!’
హైటెక్స్ సమీపంలోని స్టార్ హోటల్ బార్లో వేడుకకు వచ్చిన యువతిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఫోన్నంబర్ అడిగితే ఇవ్వకపోవటంతో మూకుమ్మడి అత్యాచారం చేస్తామంటూ బెదిరించినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది
రాయదుర్గం, న్యూస్టుడే: హైటెక్స్ సమీపంలోని స్టార్ హోటల్ బార్లో వేడుకకు వచ్చిన యువతిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఫోన్నంబర్ అడిగితే ఇవ్వకపోవటంతో మూకుమ్మడి అత్యాచారం చేస్తామంటూ బెదిరించినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. యువతి స్నేహితులే తమపై దాడికి పాల్పడ్డారంటూ అవతలి వైపు యువకులు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపారు.
ఆయన తెలిపిన ప్రకారం.. రాజస్థాన్కు చెందిన యువతి (24) నగరంలో ఉంటూ అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా ఆమె న్యూట్రిషనిస్ట్. ఏడాది తర్వాత కలిసిన స్నేహితులు విక్రమ్, విష్ణులతో కలిసి శనివారం రాత్రి 11.30 గంటలకు రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటీసీ కోహినూర్ హోటల్ ఓటినో బార్కు వెళ్లారు. అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో యువతి వద్దకు సాద్, మయాంక్ అగర్వాల్ అనే యువకులు వచ్చి ఫోన్ నంబర్ ఇవ్వమంటూ అడిగారు. అమె నిరాకరించటంతో వాగ్వాదం మొదలైంది. ఇది గమనించిన విష్ణు, విక్రమ్లు ఎదురుతిరిగారు. మాటామాటా పెరగడంతో విష్ణు, విక్రమ్లపై సాద్ దాడికి పాల్పడ్డాడు. సాద్ మరో ఆరుగురు స్నేహితులను బార్కు పిలిపించి దాడి చేయడంతో విష్ణు గాయపడ్డాడు.
ఈ సమయంలో ఆ యువతిని తాకేందుకు ప్రయత్నిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. కారులో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తామని, తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరించారు. బార్ సిబ్బంది జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించి బయటకు పంపారు. సాద్ బాటిల్తో కొట్టడంతో తలకు గాయాలయ్యాయని, ఐదు కుట్లు పడ్డాయని బాధితుడు విష్ణు మీడియాకు తెలిపాడు. బాక్సర్ అయిన విక్రమ్ కొట్టడంతో తాను గాయపడ్డానని సాద్ పేర్కొన్నాడు. సాద్, మయాంక్ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు.., బాధిత యువతి, విష్ణు, విక్రమ్ సోమవారం సాయంత్రం.. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్లు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి