ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ మృతి

మండలంలోని కోనాయిగూడెం సమీపంలో కంప్రెషర్‌ ట్రాక్టర్‌ తిరగబడటంతో డ్రైవర్‌ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... ముదిగొండ గ్రామానికి చెందిన వేముల నాగరాజు(32) స్థానిక కంకర క్వారీలో కంప్రెషర్‌ డ్రైవరుగా

Updated : 25 Jun 2022 04:49 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని కోనాయిగూడెం సమీపంలో కంప్రెషర్‌ ట్రాక్టర్‌ తిరగబడటంతో డ్రైవర్‌ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... ముదిగొండ గ్రామానికి చెందిన వేముల నాగరాజు(32) స్థానిక కంకర క్వారీలో కంప్రెషర్‌ డ్రైవరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం విధులు నిర్వర్తించి క్వారీ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కంప్రెషర్‌ ట్రాక్టరు అదుపుతప్పింది. దీంతో రహదారి వెంట ఉన్న వ్యవసాయ భూమిలో ట్రాక్టరు బోల్తాపడింది. నాగరాజుపై ట్రాక్టరు పడటంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. వాహనంపై ఉన్న మరో వ్యక్తి రాజుకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుని బంధువులు స్థానిక క్వారీ వద్దకు భారీగా చేరుకున్నారు. యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని