మత్తులో నడిపి... ప్రాణాన్ని బలిగొని..
మద్యం మత్తులో ట్రక్కు డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన దోమ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి సమీపాన శనివారం చోటు చేసుకుంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాలీఆటో
బాలుడి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
పరిగి, దోమ, న్యూస్టుడే: మద్యం మత్తులో ట్రక్కు డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన దోమ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి సమీపాన శనివారం చోటు చేసుకుంది. ఎస్.ఐ. విశ్వజన్ తెలిపిన వివరాలు. దోమ మండలంలోని ఊటుపల్లికి చెందిన సాయికుమార్ (17) ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. ఇదే గ్రామానికి చెందిన కావలి సందీప్ (13) దోమలో 9వ తరగతి చదువుతుండగా, పరిగికి చెందిన మల్లేష్ (28) కూలీ. వీరు ముగ్గురు కలిసి బైక్పై దోమకు బయల్దేరి వెళ్తున్నారు. దారిలో తిమ్మాయిపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొంది. దీంతో సాయికుమార్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సందీప్ కాలు, చేయి విరిగిపోగా, మల్లేష్కు కూడా తలకు బలమైన గాయంతో పాటు కుడికాలు విరిగింది. పరిగిలోని సామాజిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి నగరంలోని ఉస్మానియాకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగికి తరలించారు. ట్రాలీ ఆటో డ్రైవర్ వి.శేఖర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించిన సాయికుమార్ది నిరుపేద కుటుంబం. తండ్రి రాములు ఎనిమిదేళ్ల క్రితమే విద్యుదాఘాతంతో చనిపోయాడు. తల్లి చంద్రకళ కులవృత్తితో పాటు కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ః ప్రమాదంలో గాయపడ్డ మిగతా ఇద్దరు కూడా తల్లిదండ్రులకూ ఒక్కరే కుమారుడు. పరిగికి చెందిన మల్లేష్కు వివాహం అయ్యింది. అతడికి భార్య ఇద్దరు పిల్లలు సంతానం. కూలీ చేస్తూ జీవనం సాగించే వాడు. ఊటుపల్లిలో ఉంటున్న తన మేనమామ వద్దకు వారం రోజుల క్రితం వెళ్లాడు. బైకు ఎవరిది? వీరు దోమకు ఎందుకు వెళుతున్నారు? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే