గోదావరిలో అక్కాచెల్లెళ్లు మృతి

గోదావరి అందాలను చూద్దామని ఆ అక్కాచెల్లెళ్లు పురుషోత్తపల్లి నుంచి వచ్చారు. అప్పటివరకు సరదాగా గడిపారు. ఫోటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన మద్దురు శివారులో శనివారం రాత్రి జరిగింది.

Updated : 26 Jun 2022 05:03 IST

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: గోదావరి అందాలను చూద్దామని ఆ అక్కాచెల్లెళ్లు పురుషోత్తపల్లి నుంచి వచ్చారు. అప్పటివరకు సరదాగా గడిపారు. ఫోటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన మద్దురు శివారులో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన అక్కాచెళ్లెల్లు కోసన లక్ష్మి ప్రసన్న(22), సాయి రాజేశ్వరి(21) గోదావరి చూడటానికి వచ్చారు. విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం మధ్యలో మద్దూరులంక సమీపంలో ఫొటోలు తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతిచెందారు. స్థానికులు గుర్తించి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని