భార్యతో కలసి బెంగళూరు వెళ్లి అదృశ్యం
తన కుమారుడు కోడలితో కలసి కూలీపనుల కోసం బెంగళూరుకు వెళ్లాడని అయితే తన కోడలు మాత్రమే తిరిగి వచ్చిందని కుమారుడు తిరిగి రాలేదని అతని చరవాణి కూడా స్విచ్ఆఫ్ అయి ఉందని మదనపల్లె రూరల్ బోడిమల్లదిన్నెకు
కోడలిపై అనుమానంతో అత్త ఫిర్యాదు
షేక్ షఫి (పాతచిత్రం)
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే: తన కుమారుడు కోడలితో కలసి కూలీపనుల కోసం బెంగళూరుకు వెళ్లాడని అయితే తన కోడలు మాత్రమే తిరిగి వచ్చిందని కుమారుడు తిరిగి రాలేదని అతని చరవాణి కూడా స్విచ్ఆఫ్ అయి ఉందని మదనపల్లె రూరల్ బోడిమల్లదిన్నెకు చెందిన ప్యారూబీ ఆదివారం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు. తన కుమారుడు షేక్ షఫి (32) భార్య అరబ్జాన్తో కలసి కొంతకాలం క్రితం బెంగళూరుకు వెళ్లారన్నారు. అయితే వీరిద్దరి పిల్లలను తమ వద్దే ఉంచి వెళ్లారని ఆమె తెలిపారు. ఇటీవల అరబ్జాన్ మాత్రమే తిరిగి వచ్చిందని తన కుమారుడి గురించి విచారిస్తే ఆమె సరైన సమాధానం చెప్పకుండా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడిని కోడలు బెంగళూరులో ఏమో చేసిందని అందుకే తమ కుమారుడు కన్పించకుండా పోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై చంద్రశేఖర్లు కేసు విచారణ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!