వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం

ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని నెలివాడ జాతీయ రహదారి కూడలి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్సై ఎస్‌.రవి అందించిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా పరవాడకు చెందిన చిటికెల

Updated : 27 Jun 2022 05:27 IST

క్షతగాత్రుడిని తరలిస్తున్న సిబ్బంది

బొండపల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని నెలివాడ జాతీయ రహదారి కూడలి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్సై ఎస్‌.రవి అందించిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లా పరవాడకు చెందిన చిటికెల ధనంజయ్‌(19) అదే ప్రాంతానికి చెందిన వై.అరుణ్‌ కుమార్‌తో కలసి ద్విచక్రవాహనంపై బొబ్బిలిలో తమ బంధువుల పెళ్లికి వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో నెలివాడ వద్ద గుర్తుతెలియని ద్విచక్రవాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ధనంజయ్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన అరుణ్‌కుమార్‌ను 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని