చంపుతాడనే భయంతో.. చంపేశాడు
పట్టణంలో శుక్రవారం జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించారు. తాండూరు డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణానికి చెందిన లక్ష్మణ్ 20 ఏళ్ల కిందట ఉపాధికి తాండూరుకు వచ్చి, సాయిపూరులో...
హత్య కేసును ఛేదించిన పోలీసులు
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ శేఖర్గౌడ్
తాండూరు టౌన్ (న్యూస్టుడే): పట్టణంలో శుక్రవారం జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని సోమవారం రిమాండ్కు తరలించారు. తాండూరు డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణానికి చెందిన లక్ష్మణ్ 20 ఏళ్ల కిందట ఉపాధికి తాండూరుకు వచ్చి, సాయిపూరులో ఉంటూ, కార్పెంటర్గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని 12 ఏళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఉంది. పాత తాండూరుకు చెందిన అబ్దుల్ కలీంతో లక్ష్మణ్కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరి ఇంటికి వచ్చి వెళుతుండటంతో లక్ష్మణ్ భార్యతో కలీంకు సన్నిహితం పెరిగింది. ఈ విషయం తెలిసి, వాళ్లిద్దరిని అనుమానించి ఆమెను వేధింపులకు గురి చేయడంతో మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియక, కలీం వద్దే తన భార్య ఉందని భావించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. నా భార్య ఆచూకి చెప్పకపోతే నీ అంతు చూస్తానని కలీంను లక్ష్మణ్ బెదిరించాడు. తనను ఏమైనా చేస్తాడేమోనని అనుమానించి కలీం అతడినే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. 23వ తేదీ మధ్యాహ్నం ఇద్దరూ ఆర్టీసీబస్స్టేషన్ సమీపంలో మద్యం తాగారు. రాత్రి మళ్లీ అతనికి లక్ష్మణ్ ఫోన్ చేసి రమ్మని ఒత్తిడి చేశాడు. దీంతో కలీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతని మిత్రుడు గులాం మహమూద్ను తీసుకుని ద్విచక్ర వాహనంపై లక్ష్మణ్ వద్దకు వెళ్లాడు. మద్యం సీసాలు తీసుకుని గ్రీన్సిటీలోని నిర్మాణుష్య ప్రాంతానికి ముగ్గురు వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే తనతో తెచ్చుకున్న కత్తితో కలీం లక్ష్మణ్పై దాడి చేసి, తల, మెడ మీద నరికాడు. ఈ సంఘటన చూసిన గులాం అక్కడి నుంచి భయంతో పరుగెత్తాడు. లక్ష్మణ్ చనిపోయాడని నిర్ధ.రించకున్న కలీం కత్తిని అక్కడే పొదల్లో పారేసి పారిపోయాడు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి, కలీంను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ను అభినందించారు. కానిస్టేబుళ్లకు నగదు పురస్కారాన్ని అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం