Hyd News: వైద్యుల విందు.. కడుపులోనే కన్నుమూసిన పసికందు!
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాదర్ఘాట్ పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం..
చాదర్ఘాట్, న్యూస్టుడే: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాదర్ఘాట్ పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. అంబర్పేట గోల్నాక ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆరిఫ్ భార్య సురయ్య ఫాతిమా(24) కాన్సు కోసం ఈనెల 24న చాదర్ఘాట్ అక్బర్ టవర్స్లోని ఇంతియాజ్ ఆసుపత్రిలో చేరింది. 26న సాయంత్రం 3 గంటలకు పురిటి నొప్పులు రావడం కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో ఆమెకు రాత్రి 9 గంటలకు నొప్పులు రావడంతో ఆ విషయం చెప్పడానికి కుటుంబ సభ్యులు వెళ్లగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కానరాలేదు. ఎక్కడికెళ్లారని పరిశీలించగా.. ఆసుపత్రి టెర్రస్పైన విందు ఏర్పాటు చేసుకొని.. మ్యూజిక్ సిస్టం పెట్టుకొని నృత్యం చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గంట తర్వాత విందు ముగించుకొని వచ్చిన వైద్యులు.. ఫాతిమాను పరీక్షించి కడుపులోని శిశువు మృతి చెందిందని వెల్లడించినట్లు తెలిపారు. సకాలంలో వైద్యం చేయకపోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యజమానురాలు కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగనుండటంతో విందు ఏర్పాటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.
ఆసుపత్రిని మూసేయాలి.. నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని వైద్యుల వద్దకు వెళ్లగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది అంతా పాటలు, నృత్యాలలో మునిగి తేలారు. గంట తరువాత వచ్చి చూసి కడుపులో బిడ్డ మృతి చెందింది.. ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పారు. ఇతర రోగులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఆసుపత్రిని మూసివేయాలి. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తామని ఫాతిమా భర్త సయ్యద్ ఆరిఫ్ తెలిపారు.
యాజమాన్యంపై కేసు నమోదు.. బాధితురాలి భర్త ఆరిఫ్ ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై ఐపీసీ 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. మృత శిశువును ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు