బ్యాంకు మిత్ర బ్యాగు లాక్కుపోయిన దుండగులు
బ్యాంకు మిత్రను మురుగు బోదెలో తోసేసి అతని వద్ద నుంచి నగదు బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని పారిపోయిన సంఘటన తమిరిశలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్యాంకు మిత్ర, గ్రామస్థులు తెలిపిన వివరాల
రూ. 2లక్షల వరకు నగదు ఉందంటున్న బాధితుడు
తమిరిశ (నందివాడ), న్యూస్టుడే: బ్యాంకు మిత్రను మురుగు బోదెలో తోసేసి అతని వద్ద నుంచి నగదు బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని పారిపోయిన సంఘటన తమిరిశలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బ్యాంకు మిత్ర, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు నగదు చెల్లింపులు, వసూళ్ల కోసం మిత్ర దుర్గారావు టీవీఎస్ మోపెడ్పై గురువారం రాత్రి తమిరిశకు వచ్చాడు. ఉన్నత పాఠశాల పక్కరోడ్డులో ఉండగా కూరగాయలు కావాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అడగటంతో తను బ్యాంకు మిత్రను అని చెప్పానని, అంతలోనే పక్కనే ఉన్న మురుగు డ్రెయిన్లో తోసేసి తన వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని పారిపోయినట్లు అతడు చెబుతున్నాడు. తాను తేరుకుని కేకలు వేయగా చుట్టుపక్కల వారు గుమిగూడి విషయంపై ఆరాతీశారన్నాడు. ప్రస్తుతం ఖాతాల్లో అమ్మఒడి నగదు పడటంతో లబ్ధిదారులు నగదు డ్రాచేసుకునేందుకు ఫోన్లు చేయగా వచ్చానని, బ్యాగులో సుమారు రూ. 2లక్షల వరకు నగదు ఉన్నట్లు మిత్ర తెలిపాడు. సర్పంచి భర్త సొలోమాను, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని మిత్ర ద్వారా ఫోన్లో పోలీసులకు తెలియజేశారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని నందివాడ పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా కొంత కాలంగా గ్రామంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. చీకటి పడితే ఉన్నత పాఠశాల చుట్టూ కుర్రకారు చేరి, మందు, విందులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాని గ్రామస్థులు చెబుతున్నారు. నిత్యం జనసంచారం ఉండే ఈ రోడ్డులో ఇలాంటి చర్యకు పాల్పడటంపై గ్రామస్థులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్