చంపేశారు..!
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. అతి కిరాతకంగా ప్రాణాలు తీసేశాడు.. అడ్డుకోవాల్సిన అత్తమామలు ఇందుకు తోడయ్యారు.. కన్నపిల్లల ఎదుటే ఈ దారుణం జరిగితే రోదించడం తప్ప వారేమీ చేయలేకపోయారు.. కంచిలి మండలం పద్మతుల గ్రామంలో శుక్రవారం
వివాహితపై భర్త, అత్తమామల మూకుమ్మడి దాడి, హత్య
పద్మతులలో ఘటన
న్యూస్టుడే, కంచిలి
పుష్ప మృతదేహం
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. అతి కిరాతకంగా ప్రాణాలు తీసేశాడు.. అడ్డుకోవాల్సిన అత్తమామలు ఇందుకు తోడయ్యారు.. కన్నపిల్లల ఎదుటే ఈ దారుణం జరిగితే రోదించడం తప్ప వారేమీ చేయలేకపోయారు.. కంచిలి మండలం పద్మతుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీనుకు పుష్ప(30)తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు. శ్రీను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానంతో ఏడాది కిందటే ఆమెపై దాడి చేశాడు. దీంతో కేసు కంచిలి పోలీస్స్టేషన్ వరకు వెళ్లి ప్రస్తుతం పెండింగ్లో ఉంది.
కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు గ్రామంలోనే వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల శ్రీను సెలవుపై గ్రామానికి వచ్చాడు. అదే సమయంలో పుష్ప తన కన్నవారి ఊరు ఇచ్ఛాపురంలో గ్రామదేవత సంబరాలకు పిల్లలతో పాటు పిన్ని ఇంటికెళ్లింది. వారం రోజుల తర్వాత తిరిగి శుక్రవారం పద్మతుల వచ్చింది. ఆమె ఇంటికొచ్చేసరికి భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగులగొట్టి వేరే తాళాలు వేసుకొని అతని తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్లాడు. తాళాలు వేసి ఉండటాన్ని గుర్తించి పుష్ప వాటిని విరగ్గొట్టి ఇంటిని శుభ్రపరిచింది. సాయంత్రం ముగ్గురు పిల్లల్ని ఇంటికి పిలిచేందుకు భర్త ఇంటికి వెళ్లగా మామ నూకయ్య దురుసుగా ‘నీకు పిల్లలు కావాలా’ అంటూ ఆమెపై దాడికి దిగాడు. అత్త సాయమ్మ, అతనూ కలిసి రోడ్డుపైకి నెట్టేశారు. నూకయ్య, శ్రీను ఇద్దరూ ఆమె పీకనులిమారు. దీంతో ఆమె మృతిచెందింది. కోడలిని చంపేయమంటూ సాయమ్మ ప్రోత్సహించినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి పెద్ద కుమార్తె, ఆమె బంధువు బొచ్చు దాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జి ఎస్.ఐ. నారాయణస్వామి తెలిపారు. సోంపేట సీఐ రవిప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు