చంపేశారు..!
వివాహితపై భర్త, అత్తమామల మూకుమ్మడి దాడి, హత్య
పద్మతులలో ఘటన
న్యూస్టుడే, కంచిలి
పుష్ప మృతదేహం
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. అతి కిరాతకంగా ప్రాణాలు తీసేశాడు.. అడ్డుకోవాల్సిన అత్తమామలు ఇందుకు తోడయ్యారు.. కన్నపిల్లల ఎదుటే ఈ దారుణం జరిగితే రోదించడం తప్ప వారేమీ చేయలేకపోయారు.. కంచిలి మండలం పద్మతుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీనుకు పుష్ప(30)తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు. శ్రీను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానంతో ఏడాది కిందటే ఆమెపై దాడి చేశాడు. దీంతో కేసు కంచిలి పోలీస్స్టేషన్ వరకు వెళ్లి ప్రస్తుతం పెండింగ్లో ఉంది.
కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు గ్రామంలోనే వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల శ్రీను సెలవుపై గ్రామానికి వచ్చాడు. అదే సమయంలో పుష్ప తన కన్నవారి ఊరు ఇచ్ఛాపురంలో గ్రామదేవత సంబరాలకు పిల్లలతో పాటు పిన్ని ఇంటికెళ్లింది. వారం రోజుల తర్వాత తిరిగి శుక్రవారం పద్మతుల వచ్చింది. ఆమె ఇంటికొచ్చేసరికి భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగులగొట్టి వేరే తాళాలు వేసుకొని అతని తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్లాడు. తాళాలు వేసి ఉండటాన్ని గుర్తించి పుష్ప వాటిని విరగ్గొట్టి ఇంటిని శుభ్రపరిచింది. సాయంత్రం ముగ్గురు పిల్లల్ని ఇంటికి పిలిచేందుకు భర్త ఇంటికి వెళ్లగా మామ నూకయ్య దురుసుగా ‘నీకు పిల్లలు కావాలా’ అంటూ ఆమెపై దాడికి దిగాడు. అత్త సాయమ్మ, అతనూ కలిసి రోడ్డుపైకి నెట్టేశారు. నూకయ్య, శ్రీను ఇద్దరూ ఆమె పీకనులిమారు. దీంతో ఆమె మృతిచెందింది. కోడలిని చంపేయమంటూ సాయమ్మ ప్రోత్సహించినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి పెద్ద కుమార్తె, ఆమె బంధువు బొచ్చు దాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జి ఎస్.ఐ. నారాయణస్వామి తెలిపారు. సోంపేట సీఐ రవిప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: కేక్ ఎలా తినాలో నేర్చుకున్న హన్సిక.. ఆరెంజ్ జ్యూస్తో సంయుక్త!
-
General News
ED: ఈడీ హైదరాబాద్ అదనపు డైరెక్టర్గా దినేష్ పరుచూరి నియామకం
-
Sports News
Serena Williams: నేను అబ్బాయిని అయితే.. ఆటను వదిలిపెట్టేదాన్నే కాదు..!
-
India News
CJI: కొత్త సీజేఐగా జస్టిస్ యు.యు.లలిత్ నియామకం
-
Politics News
Nara Lokesh: మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారు: నారా లోకేశ్
-
India News
Omicron: దిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!