బీటెక్ విద్యార్థి హత్య?
నాలుగు రోజుల క్రితం చదువుకునేందుకు చెన్నైకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి మదనపల్లె పట్టణ శివార్లలో శవమై కన్పించిన ఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికబండతాండాకు
గుట్ట ప్రాంతంలో కుళ్లిన స్థితిలో మృతదేహం
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే: నాలుగు రోజుల క్రితం చదువుకునేందుకు చెన్నైకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి మదనపల్లె పట్టణ శివార్లలో శవమై కన్పించిన ఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికబండతాండాకు చెందిన రెడ్డెప్పనాయక్ కుమారుడు ఠాగూర్నాయక్ (23) చెన్నైలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను వారం రోజుల క్రితం స్వగ్రామంలో జరిగిన జాతరకు వచ్చి నాలుగు రోజుల క్రితం తిరిగి చెన్నైకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇతను మదనపల్లె పట్టణ శివార్లలోని బీకేపల్లె కాలనీ వెనుక భాగంలో ఉన్న గుట్ట కనుమ వద్ద విగతజీవుడై ఉంటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం ఇతను చనిపోయి ఉండటంతో మృతదేహం కుల్లిపోయింది. దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ మురళీకృష్ణ, ఎస్సై చంద్రమోహన్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి జేబులో ఉన్న చరవాణి ఆధారంగా మృతుడు తంబళ్లపల్లె వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చెన్నైకు వెళ్లిన వ్యక్తి గుట్ట ప్రాంతంలోకి ఎందుకు వెళ్లాడు. ఎలా మృతి చెందాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం పడి ఉన్న ప్రాంతంలో నలుగురు మద్యం తాగినట్లు ఖాళీ సీసాలు, గ్లాసులున్నాయి. మృతుడి మెడకు తీండ్ర తీగలు చుట్టి ఉండటంతో తీగలతో చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తెలుస్తోంది. మృతుడి జేబులో గంజాయి తాగేందుకు వినియోగించే చిలుం ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టీ మృతుడు మద్యం, గంజాయికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ చదివే విద్యార్థి నిర్మాణుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చాడు. ఇతనితో పాటు ఎవరెవరు వచ్చారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో ఆదివారం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతానికి వీఆర్వో నాగేంద్ర ఫిర్యాదు మేరకు మృతికి కారణాలు తెలియరాలేదని కేసు నమోదు చేస్తున్నామని పోస్టుమార్టం అనంతరం కేసు మార్పు చేస్తామని సీఐ తెలిపారు. ఠాగూర్నాయక్ మృతి చెందిన గుట్ట ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయని ఈ ప్రాంతంలో గస్తీ పెంచాలని స్థానికులు పోలీసులను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.