దారికి అడ్డంగా సామగ్రి పెట్టారని కత్తితో దాడి
ఇంటి నిర్మాణ సామగ్రిని దారికి అడ్డంగా పెట్టారని పక్కింటి వ్యక్తి గొడవకు దిగి ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇద్దరికి గాయాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
కామారెడ్డి అర్బన్, న్యూస్టుడే: ఇంటి నిర్మాణ సామగ్రిని దారికి అడ్డంగా పెట్టారని పక్కింటి వ్యక్తి గొడవకు దిగి ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిపల్లిలోని భగత్సింగ్నగర్లో భూమన్నగారి ఈశ్వరీబాయి అనే మహిళ కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ సామగ్రిని తన ఇంటికి వెళ్లే దారిలో పెట్టారని పక్కనే నివాసముండే అగల్ల స్వామి అనే వ్యక్తి ఈశ్వరీబాయి భర్త శంకర్రావు, కొడుకు శ్రీనివాస్తో శనివారం సాయంత్రం గొడవ పడ్డాడు. స్థానికులు సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. రాత్రి పది గంటల సమయంలో ఈ విషయమై మరో పక్కింటి వారితో మాట్లాడుతుండగా.. అంగల్ల స్వామి కత్తి పట్టుకొని పరుగులు తీస్తూ భగత్సింగ్ విగ్రహం వద్దకు వచ్చాడు. శ్రీనివాస్పై దాడి చేస్తుండగా అతని మేనమామ జాజి నరేందర్రావు గమనించి అడ్డుపడటంతో ఆయన ఛాతిలోకి కత్తి దిగింది. ఇదేమిటని అక్కడికి చేరుకొని ప్రశ్నించిన కొమ్మ సంతోష్ అనే వ్యక్తిపైనా దాడి చేసి నుదురు ప్రాంతంలో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలను మనసులో ఉంచుకొనే తమను హత్య చేసేందుకే ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు