దారికి అడ్డంగా సామగ్రి పెట్టారని కత్తితో దాడి

ఇంటి నిర్మాణ సామగ్రిని దారికి అడ్డంగా పెట్టారని పక్కింటి వ్యక్తి గొడవకు దిగి ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.  ఎస్సై ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 04 Jul 2022 06:09 IST

ఇద్దరికి గాయాలు.. పోలీసుల అదుపులో నిందితుడు

కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణ సామగ్రిని దారికి అడ్డంగా పెట్టారని పక్కింటి వ్యక్తి గొడవకు దిగి ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.  ఎస్సై ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిపల్లిలోని భగత్‌సింగ్‌నగర్‌లో భూమన్నగారి ఈశ్వరీబాయి అనే మహిళ కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. నిర్మాణ సామగ్రిని తన ఇంటికి వెళ్లే దారిలో పెట్టారని పక్కనే నివాసముండే అగల్ల స్వామి అనే వ్యక్తి ఈశ్వరీబాయి భర్త శంకర్‌రావు, కొడుకు శ్రీనివాస్‌తో శనివారం సాయంత్రం గొడవ పడ్డాడు. స్థానికులు సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. రాత్రి పది గంటల సమయంలో ఈ విషయమై మరో పక్కింటి వారితో మాట్లాడుతుండగా.. అంగల్ల స్వామి కత్తి పట్టుకొని పరుగులు తీస్తూ భగత్‌సింగ్‌ విగ్రహం వద్దకు వచ్చాడు. శ్రీనివాస్‌పై దాడి చేస్తుండగా అతని మేనమామ జాజి నరేందర్‌రావు గమనించి అడ్డుపడటంతో ఆయన ఛాతిలోకి కత్తి దిగింది. ఇదేమిటని అక్కడికి చేరుకొని ప్రశ్నించిన కొమ్మ సంతోష్‌ అనే వ్యక్తిపైనా దాడి చేసి నుదురు ప్రాంతంలో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలను మనసులో ఉంచుకొనే తమను హత్య చేసేందుకే ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని