నమ్ముకున్నోడే కాలయముడయ్యాడు!

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్‌లో ఓ వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఎస్సై బండారి రాజు వివరాల ప్రకారం.. కొండాపూర్‌ గ్రామానికి చెందిన పున్నం వెంకన్నకు సూర్యాపేట జిల్లా

Updated : 05 Jul 2022 03:36 IST

 మహిళ దారుణ హత్య

మృతదేహాన్ని తరలిస్తున్న ఎస్సై రాజు, గ్రామస్థులు

రాయపర్తి, న్యూస్‌టుడే : వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్‌లో ఓ వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఎస్సై బండారి రాజు వివరాల ప్రకారం.. కొండాపూర్‌ గ్రామానికి చెందిన పున్నం వెంకన్నకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన నాలి మంజుల(45)తో 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌ లింగంపల్లిలోని ఓ వృద్ధాశ్రమంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేస్తూ అక్కడే పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం వారు స్వగ్రామానికి చేరుకొని, గొడవ పడుతుండగా స్థానికులు సర్దిచెప్పారు. రాత్రి సమయంలో మరోమారు గొడవ పడగా వెంకన్న మద్యం మత్తులో కత్తిపీటను(కూరగాయలు తరిగేందుకు ఉపయోగించేది) గ్యాస్‌ స్టవ్‌పై వేడి చేసి మంజుల చేతులను కాల్చి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, హింసించి హత్య చేశాడు. ఆమెను చంపేశానంటూ నిందితుడు సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతుండగా స్థానికులకు విషయం తెలిసింది. వారు పోలీసులకు సమచారం ఇచ్చారు. మంజులకు 22 ఏళ్ల కిందట వివాహంకాగా కుమారుడు జన్మించాక భర్తకు విడాకులు ఇచ్చింది. వెంకన్న మొదటి భార్యను కడతేర్చి జైలుకెళ్లగా, మరో మహిళతో సంబంధం పెట్టుకోగా అతని ఆకృత్యాలు తట్టుకోలేక వదిలి వెళ్లింది. మృతురాలి కుమారుడు మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని