‘ఇంజినీరింగ్ విద్యార్థిది హత్యే’
అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిది హత్యేనని కేసు మార్పు చేసినట్లు రెండో పట్టణ ఎస్.ఐ. చంద్రమోహన్ తెలిపారు. ఎస్.ఐ. కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండ తాండాకు చెందిన రెడ్డెప్పనాయక్ కుమారుడు ఠాగూర్నాయక్ (23)
ఠాగూర్ నాయక్ (పాతచిత్రం)
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే: అనుమనాస్పద స్థితిలో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిది హత్యేనని కేసు మార్పు చేసినట్లు రెండో పట్టణ ఎస్.ఐ. చంద్రమోహన్ తెలిపారు. ఎస్.ఐ. కథనం మేరకు.. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండ తాండాకు చెందిన రెడ్డెప్పనాయక్ కుమారుడు ఠాగూర్నాయక్ (23) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో పండుగ కోసం ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళుతున్నానని చెప్పి మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో గత నెల 2వ తేదీన మదనపల్లె పట్టణంలోని బీకేపల్లె కాలనీ వెనుక భాగంలోని గుట్టకనుమ ప్రాంతంలో మృతి చెంది పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా అతనంతకు అతనే చనిపోలేదని ఎవరో చంపినట్లు నిర్ధారణ అయ్యిందని ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడి మెడచుట్టూ తీగలు ఉండటంతో తీగలతో గొంతు బిగించి ఠాగూర్ నాయక్ను హత్య చేసినట్లు అప్పట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సీఐ మురళీకృష్ణ ఆదేశానుసారం అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్పు చేశామని ఠాగూర్నాయక్ను హత్య చేసిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.