కూతురుకు విద్యుదాఘాతం.. కాపాడబోయి తల్లి మృతి

వర్షానికి తడిసిపోతాయని తీగపై ఆరేసిన బట్టలను తీసే క్రమంలో కూతురు విద్యుదాఘాతంతో కింద పడిపోవడంతో ఆమెను కాపాడబోయిన తల్లి మృతి చెందిన ఘటన అందుగులపల్లిలో శనివారం చోటుచేసుకుంది.

Updated : 07 Aug 2022 06:55 IST


మృతి చెందిన పద్మ

పెద్దపల్లి, న్యూస్‌టుడే: వర్షానికి తడిసిపోతాయని తీగపై ఆరేసిన బట్టలను తీసే క్రమంలో కూతురు విద్యుదాఘాతంతో కింద పడిపోవడంతో ఆమెను కాపాడబోయిన తల్లి మృతి చెందిన ఘటన అందుగులపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సాయిప్రసన్న బట్టలను తొలగించే ప్రయత్నంలో తీగకు విద్యుత్తు ప్రసరణ జరగడంతో కింద పడిపోయింది. ఆమెను కాపాడేందుకు తల్లి పోలవేని పద్మ(40) ప్రయత్నించి విద్యుదాఘాతంతో కింద పడిపోయింది. స్థానికులు పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది. సాయిప్రసన్నను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. మృతురాలి భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని