Crime News : చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ మోసం
చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని నమ్మబలికి మహిళ నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం తోటచర్లలో చోటుచేసుకుంది.
పెనుగంచిప్రోలు: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని నమ్మబలికి మహిళ నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం తోటచర్లలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. తోటచర్లకు చెందిన ఒక వ్యక్తి మూడు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మృతితో భార్య మానసిక ఒత్తిడికి గురైంది. గత నెలలో గ్రామానికి ఒకరు సోది చెబుతానని రాగా.. అతనితో సోది చెప్పించుకుంది. తన భర్త చనిపోయిన విషయం అతనికి చెప్పింది. మీ ఇంటికి నాగ దోషం పట్టుకుందని, అందుకే భర్త చనిపోయాడని, రూ. 5 వేలు ఇస్తే దోషం వదిలిస్తానని చెప్పారు. ఆమె రూ. 5 వేలు ఇవ్వగా పూజలు చేశాడు. చనిపోయిన నీ భర్తను బతికించే శక్తి తన గురువుకు ఉందని ఒకరితో ఫోన్లో మాట్లాడించాడు. ఆ మాటలు నమ్మిన మహిళ సరేనని ఒప్పుకుంది. గురువు మొదట రూ.లక్ష డిమాండ్ చేశాడు. చివరకు రూ.50 వేలకు ఒప్పుకున్నాడు. తొలుత సోది చెప్పేందుకు వచ్చిన వ్యక్తికి రూ. 20 వేలు ఇవ్వగా తీసుకొని వెళ్లిపోయాడు. ఆషాఢం వెళ్లిన తర్వాత పూజలు మొదలు పెడతామని తెలిపాడు. ఈలోగా ఆ మహిళ, గురువుతో పలుమార్లు ఫోన్లో మాట్లాడింది. ఆమె తొందర పెట్టడంతో సోది చెప్పిన వ్యక్తే శనివారం మహిళ ఇంటికి వచ్చాడు. మొదటి నుంచి ఆ తంతును గమనిస్తున్న ఇంటి చుట్టుపక్కలవ్యక్తులు అతన్ని పట్టుకొని గట్టిగా మందలించారు. తన పేరు పస్తం రెడ్డియ్య అని, తనది గుంటూరు జిల్లా తుళ్లూరు అని చెప్పాడు. తనకేమీ తెలియదని, డబ్బులు గురువే తీసుకున్నాడని వాపోయాడు. గ్రామస్థులు అతడిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. మహిళ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. గతంలో ఇచ్చిన నగదును తిరిగి మహిళకు ఇప్పించారు. ఎస్సై హరిప్రసాద్ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని, తుళ్లూరులో ఉన్న గురువును రప్పించి విచారణ చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు