భార్యాబిడ్డను హతమార్చి..ఆపై ఆత్మహత్య
కుటుంబ కలహాలతో భార్య, అయిదు నెలల పసికందును గొంతు నులిమి హతమార్చిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఇస్కపల్లిలో విషాదం
అల్లూరు, న్యూస్టుడే : కుటుంబ కలహాలతో భార్య, అయిదు నెలల పసికందును గొంతు నులిమి హతమార్చిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏడాదిన్నర కిందట గ్రామానికి చెందిన ఆవుల మురళి (25), స్వాతి (20)కి వివాహమైంది. వారికి అయిదు నెలల పాప ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా కొన్ని రోజులుగా స్వాతి పుట్టింట్లో ఉంటోంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు భర్త పలుమార్లు యత్నించినా వీలు కాలేదు. ఈనెల 4న అతని అక్క వెంకటరమణమ్మ స్వాతికి నచ్చజెప్పి భర్త వద్దకు తీసుకొచ్చారు. శనివారం రాత్రి భార్య, భర్త, పాప ఇంట్లోనే ఉన్నారు. ఆదివారం ఉదయం చాలా సేపటి వరకు తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే తల్లి, పాప మృతిచెందగా మురళి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమార్తె, మనుమరాలిని మామ గోవిందు, అత్త బంగారమ్మ, ఆడబిడ్డ వెంకటరమణమ్మ కలిసి హత్య చేశారని అల్లూరు పోలీస్స్టేషన్లో ఆమె తండ్రి గోవిందు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెపై ఇష్టం లేకుంటే ఇంటికి పంపాల్సిందని, ఇలా హతమార్చడం దారుణమని తండ్రి బోరున విలపించారు. కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా విషాదం అలముకుంది. కావలి ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీహరి, కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, అల్లూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు.. మురళి, స్వాతి (పాతచిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి