కిరాతకంగా హత్య

‘నా భర్త పెంచలయ్యను గ్రామానికి చెందిన అజయ్‌ అనే యువకుడు కిరాతంగా హత్య చేశాడు... నాకళ్ల ఎదుటే హత్య తీరును పోలీసులకు వివరంగా చెప్పా.. మరొకరి పేరు కూడా చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నార’ని మండలంలోని గుడ్లూరువారి పాళెంలో ఇటీవల హత్యకు గురైన మైలారి పెంచలయ్య భార్య శ్రావణి ఆరోపించారు.

Updated : 08 Aug 2022 04:13 IST

\

మాట్లాడుతున్న శ్రావణి

వెంకటాచలం, న్యూస్‌టుడే: ‘నా భర్త పెంచలయ్యను గ్రామానికి చెందిన అజయ్‌ అనే యువకుడు కిరాతంగా హత్య చేశాడు... నాకళ్ల ఎదుటే హత్య తీరును పోలీసులకు వివరంగా చెప్పా.. మరొకరి పేరు కూడా చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నార’ని మండలంలోని గుడ్లూరువారి పాళెంలో ఇటీవల హత్యకు గురైన మైలారి పెంచలయ్య భార్య శ్రావణి ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నా భర్త స్నేహితుడైన అజయ్‌ నేను సన్నిహితంగా ఉండేవాళ్లం. గత నెల 31వతేదీ రాత్రి పెంచలయ్య గ్రామంలో ఉత్సవం వద్దకు వెళ్లారు. భర్త లేని సమయం చూసి అజయ్‌ మాఇంటికి వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అజయ్‌ నాభర్తను మంచంపై తోచివేసి గుండెలపై పలుమార్లు పిడుగుద్దులు గుద్దారు. దీంతో పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోగా కుమారుడిని హత్య చేస్తానని బెదిరించాడు. అజయ్‌ నాభర్త గొంతుకు చీర గట్టిగా బిగించారు. ఎవరైనా అడిగితే ఉరి వేసుకుని చనిపోయారని చెప్పమన్నారు. మరో యువకుడు బాలరాజు పేరు చెప్పాలని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సీఐ జగన్‌మోహన్‌రావు స్పందిస్తూ...  ఎవరెవరికి ఈహత్యతో సంబంధం ఉందో తేల్చేందుకు విచారణ జరుపుతున్నామన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధితులతో మాట్లాడారు. మైలారి పెంచలయ్యది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో ఆయన హత్యకు గురైనట్లు  ధ్రువీకరించినట్లు తెలిసింది.  భార్య శ్రావణితోపాటు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని