కిరాతకంగా హత్య
‘నా భర్త పెంచలయ్యను గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు కిరాతంగా హత్య చేశాడు... నాకళ్ల ఎదుటే హత్య తీరును పోలీసులకు వివరంగా చెప్పా.. మరొకరి పేరు కూడా చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నార’ని మండలంలోని గుడ్లూరువారి పాళెంలో ఇటీవల హత్యకు గురైన మైలారి పెంచలయ్య భార్య శ్రావణి ఆరోపించారు.
\
మాట్లాడుతున్న శ్రావణి
వెంకటాచలం, న్యూస్టుడే: ‘నా భర్త పెంచలయ్యను గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు కిరాతంగా హత్య చేశాడు... నాకళ్ల ఎదుటే హత్య తీరును పోలీసులకు వివరంగా చెప్పా.. మరొకరి పేరు కూడా చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నార’ని మండలంలోని గుడ్లూరువారి పాళెంలో ఇటీవల హత్యకు గురైన మైలారి పెంచలయ్య భార్య శ్రావణి ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నా భర్త స్నేహితుడైన అజయ్ నేను సన్నిహితంగా ఉండేవాళ్లం. గత నెల 31వతేదీ రాత్రి పెంచలయ్య గ్రామంలో ఉత్సవం వద్దకు వెళ్లారు. భర్త లేని సమయం చూసి అజయ్ మాఇంటికి వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అజయ్ నాభర్తను మంచంపై తోచివేసి గుండెలపై పలుమార్లు పిడుగుద్దులు గుద్దారు. దీంతో పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుకోబోగా కుమారుడిని హత్య చేస్తానని బెదిరించాడు. అజయ్ నాభర్త గొంతుకు చీర గట్టిగా బిగించారు. ఎవరైనా అడిగితే ఉరి వేసుకుని చనిపోయారని చెప్పమన్నారు. మరో యువకుడు బాలరాజు పేరు చెప్పాలని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సీఐ జగన్మోహన్రావు స్పందిస్తూ... ఎవరెవరికి ఈహత్యతో సంబంధం ఉందో తేల్చేందుకు విచారణ జరుపుతున్నామన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బాధితులతో మాట్లాడారు. మైలారి పెంచలయ్యది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో ఆయన హత్యకు గురైనట్లు ధ్రువీకరించినట్లు తెలిసింది. భార్య శ్రావణితోపాటు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం