రౌడీ షీటర్ల కత్తులాట
నంద్యాలలో శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయి. రౌడీ షీటర్లు కత్తులతో హల్చల్ చేస్తున్నారు. సినిమాను తలపించేలా పోలీసులను పరిగెత్తించి అతిదారుణంగా కడతేర్చుతున్నారు. ఆదివారం జరిగిన కానిస్టేబుల్
ఈనాడు - కర్నూలు, నంద్యాల నేరవిభాగం- న్యూస్టుడే: నంద్యాలలో శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయి. రౌడీ షీటర్లు కత్తులతో హల్చల్ చేస్తున్నారు. సినిమాను తలపించేలా పోలీసులను పరిగెత్తించి అతిదారుణంగా కడతేర్చుతున్నారు. ఆదివారం జరిగిన కానిస్టేబుల్ హత్యతో జిల్లా కేంద్ర వాసులు ఒక్కసారిగా ఉల్కి పడ్డారు. పలు హత్య కేసుల్లో నిందితులు.. రౌడీ షీటర్లు పట్టణంలో తిరుగుతూ దందాలు చేస్తున్నారు. నిఘా ఉంచాల్సిన పోలీసుశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నడిరోడ్డుపై దారుణాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఆదివారం ఏం జరిగింది
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేంద్రకుమార్(35) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. తిరుమల ప్రయాణం నేపథ్యంలో చిరిగిన తన బ్యాగు కుట్టించుకోవడానికి బయటకెళ్లారు. అక్కడ ఓ భవనం పైఅంతస్తులో మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న కొందరు కానిస్టేబుల్కు తారసపడ్డారు. ‘‘పోలీస్’’ అని చెప్పగానే మాకేంటి అంటూ ఆ ఆరుగురు బీరు సీసాలతో తలపై ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. సురేంద్రకుమార్ వాళ్ల నుంచి తప్పించుకొనేందుకు కొంత దూరం పరిగెత్తగా వెంబడించి పట్టుకుని ఆటోలో ఎక్కించినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. అరుస్తున్నవారిని వారించబోయి నందుకే కిడ్నాప్ చేసి కత్తులతో దాడి చేసి చంపుతారా? అనేది ప్రశ్నగా మిగిలింది.
10 హత్యలు... 22 హత్యాయత్నాలు
నంద్యాల పట్టణంలో కొందరు యువకులు గ్యాంగ్లుగా తిరుగుతూ హత్యలకు పాల్పడుతున్నారు. నంద్యాల జిల్లాగా ఏర్పాటైన తర్వాత హత్యల పరంపర ఎక్కువైంది. స్థిరాస్తి వ్యాపారం పెరగడంతో స్థలాల ఘర్షణలకు తావిస్తోంది. రౌడీషీటర్లు పంచాయితీలు చేస్తూ అమాయకులను బెదిరిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 2021 నుంచి ఇప్పటి వరకు పది హత్యలు.. 22 హత్యాయత్నాలు నమోదవ్వడం నేర సంస్కృతి పెరిగిందనడానికే తార్కాణం.
తండ్రి హత్యా వారసత్వాన్ని
కానిస్టేబుల్ హత్య కేసులో ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నాలుగు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండటమే కాకుండా అతనిపై రౌడీషీట్ నమోదై ఉంది. అతని తండ్రి గొంతుకోసి చంపడంలో స్పెషలిస్టుగా.. మర్డర్ల ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. అతని కుమారుడు ప్రస్తుతం పట్టపగలే హత్యలు చేస్తూ ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాడు. గతేడాది పట్టణంలో ఎన్జీవో కాలనీలో ఓ రౌడీషీటర్ను కత్తులతో అతి దారుణంగా నరికి చంపిన హత్య కేసులో ప్రధానంగా వ్యవహరించినట్లు సమాచారం. కానిస్టేబుల్ హత్యలో పాల్గొన్న ఆరుగురిలో ముగ్గురు పలు హత్య కేసుల్లో ఉన్నారు.
పెట్రోలింగ్ నామమాత్రమే
పోలీసులు సాంకేతికను ఉపయోగించి గస్తీలు పర్యవేక్షిస్తున్నారు. బ్లూకోట్స్ 10 ఉండగా ప్రతి పోలీస్స్టేషన్కు రెండు ద్విచక్ర వాహనాలు గస్తీ తిరుగుతున్నాయి. విధుల్లో ఉండే పోలీసులు తప్పకుండా రాత్రిళ్లు సెల్ఫీ దిగి పోలీసులు అధికారులకు పంపుతున్నారు. పెట్రోలింగ్ కేవలం చిత్రాలకే పరిమితమైందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది సిబ్బంది సెల్ఫీలు సమయానికి దిగి విధుల్లో తిరగడం లేదని తెలుస్తోంది. ఆదివారం రాత్రి జరిగిన సంఘటన చూస్తే పోలీస్ పెట్రోలింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిఘా నేత్రాలకు మస్కా
నంద్యాల పట్టణంలో సీసీఎస్ కంట్రోల్లో 69 సీసీ కెమెరాలు ఉండగా 40 పనిచేస్తున్నాయి. అమరావతి బృహస్పతి అనే సీసీ కెమెరాలు 162 ఉండగా.. పన్నెండు మూలకు చేరాయి. మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. నంద్యాలలో ప్రతి పోలీస్స్టేషన్ సీఐగా అప్గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్లలో సిబ్బందిని పెంచలేదు. ప్రతి పోలీస్స్టేషన్కు 45 మంది సిబ్బంది అవసరంకాగా, ప్రస్తుతం ఒక్కో స్టేషన్లో ఇరవై మంది కంటే ఎక్కువ లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..