మూడేళ్ల చిన్నారి అదృశ్యం
స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో మంగళవారం మూడేళ్ల చిన్నారి అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... విస్సన్నపేట ప్రాంతానికి చెందిన కనకదుర్గ, చెన్నారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
ప్రిన్స్ జాయ్ (పాత చిత్రం)
అజిత్సింగ్నగర్, న్యూస్టుడే : స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో మంగళవారం మూడేళ్ల చిన్నారి అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... విస్సన్నపేట ప్రాంతానికి చెందిన కనకదుర్గ, చెన్నారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కనకదుర్గ విస్సన్నపేటలో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తుండగా, చెన్నారావు ప్రైవేటు ఉద్యోగి. వీరి పెద్ద కుమార్తె ప్రిన్స్ జాయ్(3) తన అమ్మమ్మ భూలక్ష్మితో కలిసి బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలో పెళ్లి వేడుక నిమిత్తం బంధువుల ఇంటికి వచ్చింది. ముద్దుముద్దు మాటలతో అందర్నీ నవ్వించింది. చిట్టిపొట్టి అడుగులతో వేడుక వద్ద తిరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కనిపించలేదు. బంధువులు సమీప ప్రాంతాల్లో వెతికారు. వేడుక జరిగే ఇల్లు బుడమేరు కాల్వకు ఆనుకుని ఉండటంతో.. ఒక వేళ ప్రమాదవశాత్తూ చిన్నారి కాలువ అంచున పడిపోయి ఉంటుందనే అనుమానంతో కాల్వలోనూ గాలించారు. కానీ ఆచూకీ లభ్యంకాలేదు. అజిత్సింగ్నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ లక్ష్మీనారాయణ వచ్చి, బాలిక కోసం వెతుకులాట ప్రారంభించారు. నార్త్ మండల ఇన్ఛార్జి ఏసీపీ రమణమూర్తి, సీటీఎఫ్ ఏడీసీపీ కొల్లి శ్రీనివాసరావులు వివరాలు సేకరించి.. గాలింపు చర్యలను పర్యవేక్షించారు. చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారా? అన్న కోణంలోనూ విచారణ చేపట్టి రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో వెతికించారు. రాత్రి 9 గంటల సమయానికి కూడా ఆచూకీ లభ్యం కాక పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే