Hyderabad News: ఊరెళ్లొద్దంటే చంపేశాడు.. 17 రోజులకు వీడిన జంట హత్యల మిస్టరీ
ఉపాధి దొరకలేదని.. తిరిగి వెళ్తానంటే.. వెళ్లనివ్వలేదని కోపంతో ఇద్దర్ని హతమార్చాడు. ఆపై గ్యాస్సిలిండర్లను పేల్చి ఆత్మహత్య చేసుకోవాలనుకొని ధైర్యం చాలక కిటికీ నుంచి దూకి పారిపోయాడు. జీడిమెట్ల ఠాణా రాంరెడ్డినగర్లో సంచలనం
జీడిమెట్ల, న్యూస్టుడే: ఉపాధి దొరకలేదని.. తిరిగి వెళ్తానంటే.. వెళ్లనివ్వలేదని కోపంతో ఇద్దర్ని హతమార్చాడు. ఆపై గ్యాస్సిలిండర్లను పేల్చి ఆత్మహత్య చేసుకోవాలనుకొని ధైర్యం చాలక కిటికీ నుంచి దూకి పారిపోయాడు. జీడిమెట్ల ఠాణా రాంరెడ్డినగర్లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు 17 రోజుల తర్వాత చిక్కుముడి వీడింది. గురువారం జీడిమెట్ల ఠాణాలో సీఐ ఎం.పవన్, ఎస్సై గౌతమ్తో కలిసి బాలానగర్ ఏసీపీ గంగారం వివరాలు వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బీరేంద్రకుమార్ జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పనిచేశాడు. సొంతూరికి వెళ్లి గతనెల 26న.. 9 మందిని వెంటబెట్టుకుని నగరానికి వచ్చాడు. వారికి పని కల్పించాలని ఓ పరిశ్రమకు వెళ్లాడు. కేవలం ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఇబాదత్ అన్సారీ, ఇమాముద్దీన్, కలీముద్దీన్, భునేశ్వర్సింగ్ను తీసుకొని రాంరెడ్డినగర్లోని గదికి వెళ్లారు. భునేశ్వర్సింగ్ తిరిగి సొంతూరికి వెళ్తానని బీరేంద్రకుమార్ వద్దని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇమాముద్దీన్, కలీముద్దీన్ మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. గొడవ తీవ్రం కావడంతో సహనం కోల్పోయిన భునేశ్వర్.. కట్టెతో బీరేంద్రకుమార్ తలపై కొట్టాడు. ఇబాదత్ అన్సారీ అడ్డుకోగా అతన్నీ విచక్షణా రహితంగా కొట్టడంతో ఇద్దరూ మృతిచెందారు. నిందితుడు తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వెంటనే అక్కడున్న రెండు గ్యాస్ సిలిండర్లను లీక్ చేసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో భయంతో కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. పక్కన గదిలో ఉన్న ఇమాముద్దీన్, కలీముద్దీన్.. పేలుడు ధాటికి భయపడి కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. భునేశ్వర్సింగ్ ఝార్ఖండ్లోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి అతన్ని పట్టుకొచ్చి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.