మునేరు కాల్వలో ఆటో బోల్తా.. మహిళ మృతి
ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మంది గాయాలపాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వత్సవాయి మండలం పాత వేమవరానికి చెందిన వ్యవసాయ కూలీలు పెనుగంచిప్రోలులో వరి నాట్లు వేసేందుకు గురువారం ఉదయం ఆటోలో బయలుదేరారు. మునేరు కాల్వకట్టపై ప్రయాణిస్తున్న
కాల్వలో పడిన ఆటో
పెనుగంచిప్రోలు, న్యూస్టుడే: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మంది గాయాలపాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వత్సవాయి మండలం పాత వేమవరానికి చెందిన వ్యవసాయ కూలీలు పెనుగంచిప్రోలులో వరి నాట్లు వేసేందుకు గురువారం ఉదయం ఆటోలో బయలుదేరారు. మునేరు కాల్వకట్టపై ప్రయాణిస్తున్న ఆటోను వెనుక వచ్చిన మరో ఆటో ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆటో కుదుపునకు గురై కాల్వలో పల్టీలు కొట్టింది. నీటిలో పడిపోయిన మహిళలంతా ఆహాకారాలు చేశారు. స్థానికులు స్పందించి వారిని బయటకు తీశారు. గుజ్జ మేరీ (45)పై ఆటో పడిపోవడంతో చాలా సేపటి వరకు ఆమెను గమనించలేకపోయారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేశారు. వాహనం అందుబాటులో లేక క్షతగాత్రులను మరో ఆటోలో పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. మేరీని నందిగామ తరలించాలని ఆస్పత్రి సిబ్బంది సూచించడంతో ఆటోలో తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందించకుండా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన అమర్లపూడి పుష్పమ్మ, రాయల లక్ష్మి, గుత్తికొండ మాధూరి, నాగరత్నం, లింగాల రాధ, కొలిపాక నాగేంద్రం, మద్దెల జ్ఞానమ్మ, కొమ్మినేని రాములు, దుంగా ప్రభావతి, దామాల కమల, దూడగుండ్ల విజయమ్మలను మెరుగైన వైద్యం కోసం జగ్గయ్యపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామ నాయకుడు మాదల వీరయ్య చౌదరి వెంటనే స్పందించి క్షతగాత్రులకు సేవలందించారు. ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్