రైళ్లలో చోరీలు చేసే ఆర్ఎంపీ అరెస్టు
రైళ్లలో చోరీలు చేసే ఆర్ఎంపీ వైద్యుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీఆర్పీ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిందితుడి వివరాలు తెలుపుతున్న జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ సీఐ రామయ్య, ఎస్సైలు
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : రైళ్లలో చోరీలు చేసే ఆర్ఎంపీ వైద్యుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీఆర్పీ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపల్లెకు చెందిన శ్రీనివాసరావు గత నెల 28వ తేదీన కాచీగూడ ఎక్స్ప్రెస్లో ఎక్కారు. గుంటూరుకు చేరుకునేప్పటికి అతని బ్యాగ్ కనిపించలేదు. బ్యాగ్లో రూ. 8 లక్షల నగదు ఉందని, ఎవరో అపహరించారని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ గంగా వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. ఈక్రమంలో శుక్రవారం రైల్వేస్టేషన్లోని 3వ ప్లాట్ఫారంపై జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ సీఐ రామయ్య, ఎస్సైలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబులు ఎంఎస్కె రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీసీలు వలి, సుభాని, సాంబశివరావు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసిన ఓ వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని పరుగుపెట్టడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. బాపట్ల జిల్లా, భట్టిప్రోలుకు చెందిన తన పేరు ప్రవీణ్ అని ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తుంటానని పోలీసులకు తెలిపాడు. అతని సంచిని పరిశీలించగా రూ. 4 లక్షల నగదు లభించింది. జల్సాలకు అలవాటుపడి దొంగతనం చేసినట్లు తెలిపాడని సీఐ చెప్పారు. 28వ తేదీ రేపల్లె నుంచి గుంటూరు వస్తున్న క్రమంలో రైలులో ప్రయాణికుడు శ్రీనివాసరావుకు చెందిన బ్యాగ్ అపహరించి రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు నిందితుడి అంగీకరించాడని సీఐ తెలిపారు. మిగిలిన డబ్బులు భట్టిప్రోలులో దాచేందుకు వెళ్తున్న క్రమంలో అరెస్టు చేశామన్నారు. రూ. 4 లక్షలు జప్తు చేశామని సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..