ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం
కూసుమంచి మండలంలోని మంగలి తండాలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో రైతు గుగులోతు హన్మంతు(43) దుర్మరణం పాలయ్యారు. నాయకన్గూడెం గ్రామ రైతుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకున్న హన్మంతు తన ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా టైర్లు దిగబడ్డాయి.
మృతి చెందిన హన్మంతు
కూసుమంచి, న్యూస్టుడే: కూసుమంచి మండలంలోని మంగలి తండాలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో రైతు గుగులోతు హన్మంతు(43) దుర్మరణం పాలయ్యారు. నాయకన్గూడెం గ్రామ రైతుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకున్న హన్మంతు తన ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా టైర్లు దిగబడ్డాయి. ట్రాక్టర్ను బలవంతంగా గట్టెక్కించే ప్రయత్నం చేయడంతో బోల్తా పడింది. దీంతో హన్మంతు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ నందీప్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!