చోరీకి వచ్చి.. ఏటీఎంకు నిప్పు
అనంతపురం నగరం నడిబొడ్డున ఓ ఏటీఎం కేంద్రంలో చోరీకి యంత్నించిన దొంగలు యంత్రానికి నిప్పు పెట్టారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్రవేశించారు. అందులో ఉన్న రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టడానికి
కేంద్రంలో యంత్రానికి నిప్పు పెడుతున్న దొంగ
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: అనంతపురం నగరం నడిబొడ్డున ఓ ఏటీఎం కేంద్రంలో చోరీకి యంత్నించిన దొంగలు యంత్రానికి నిప్పు పెట్టారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ప్రవేశించారు. అందులో ఉన్న రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టడానికి యత్నించారు. ఫలితం లేక పోవడంతో దుండగులు ఓ యంత్రానికి నిప్పు పెట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. కేంద్రం నుంచి మంటలు వస్తున్న విషయాన్ని అటుగా వెళ్తున్న కాలేషావలి అనే వ్యక్తి డయల్ 100, ఫైర్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఏడీఎఫ్వో అశ్వర్థ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సమాచారం తెలుసుకున్న బ్యాంకు అధికారులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సమీపంలోని దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకున్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిప్పుపెట్టిన తర్వాత దుండగులు ఆర్ట్స్ కళాశాల వసతిగృహం వైపు వెళ్లినట్లు గుర్తించారు. నగరంలో నైట్బీట్ నిర్వహిస్తున్న పోలీసులు హైఅలర్ట్ యాప్ ద్వారా అప్రమత్తమై ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. దొంగల ఆచూకీ లభించలేదు. సాంకేతిక విభాగ బృందం వస్తే తప్ప, నగదు అపహరణకు గురయ్యిందా? లేదా? అనే విషయాలు నిర్ధారణకు రాలేమని బ్యాంకు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ (సెషన్-2) ఫలితాలు వచ్చేశాయ్..
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM