యువతి ఆత్మహత్య

కాశీబుగ్గ నెహ్రూనగర్‌లో ఉంటున్న పి.ఊర్వశి(23) అనే యువతి శనివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు.

Updated : 14 Aug 2022 05:45 IST


ఊర్వశి

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గ నెహ్రూనగర్‌లో ఉంటున్న పి.ఊర్వశి(23) అనే యువతి శనివారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా అంతరసింగికి చెందిన ఊర్వశి కొంతకాలంగా కాశీబుగ్గలో మరో మహిళతో కలిసి నివశిస్తూ స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తోంది. తోటి మహిళ బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఊర్వశి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. వివరించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని