బైక్‌ కొనివ్వలేదని విద్యార్థి బలవన్మరణం

ద్విచక్రవాహనం కొనివ్వలేదని కుటుంబ తల్లిదండ్రులతో గొడవపడిన ఓ విద్యార్థి బలవన్మరణం చెందిన సంఘటన చోటు చేసుకొన్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం..

Updated : 15 Aug 2022 05:30 IST


వెంకటేశ్‌

మాధవానిపల్లి (అమ్రాబాద్‌), న్యూస్‌టుడే : ద్విచక్రవాహనం కొనివ్వలేదని కుటుంబ తల్లిదండ్రులతో గొడవపడిన ఓ విద్యార్థి బలవన్మరణం చెందిన సంఘటన చోటు చేసుకొన్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలంలోని మాధవానిపల్లికి చెందిన విద్యార్థి గాజుల వెంకటేశ్‌ (19) అచ్చంపేటలో ఓపెన్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. ద్విచక్రవాహనం కావాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక కారణాలతో వాయిదా వేస్తు వచ్చారు. విషయంపై సోమవారం తల్లిదండ్రులతో తగాదా పడ్డాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరులేని సమయంలో మనస్తాపంతో పురుగుమందు తాగాడు. కొంతసేపటికి వాంతులు చేసుకొంటుండటంతో గమనించిన పొరుగువారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అచ్చంపేట ఆసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఉన్న ఒక్కనొక్క కుమారుడు బలవన్మరణం చెందటంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని అమ్రాబాద్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని