‘కూలిన’ బతుకులు
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లారు.. తిరిగొచ్చే క్రమంలో మృత్యువు వారిని వెంటాడింది. వాహనంలో సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న వారిపై చెట్టు పడింది.
ఆటోపై చెట్టు పడడంతో ఇద్దరి దుర్మరణం
మెంటాడ, న్యూస్టుడే: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లారు.. తిరిగొచ్చే క్రమంలో మృత్యువు వారిని వెంటాడింది. వాహనంలో సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న వారిపై చెట్టు పడింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ మధుర గ్రామాలైన కొండపర్తిబాడవ, తోటవలస, ఆండ్ర తదితర గ్రామాలకు చెందిన 12 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఆదివారం పిట్డాడ వెళ్లారు. పనులు పూర్తయ్యాక సాయంత్రం ఆటోలో తిరుగు పయనమయ్యారు. బయలుదేరిన కొంతసేపటికే వారి గుండెలు ఉలిక్కిపడ్డాయి.
ఉన్నట్టుండి పెద్ద తాటిచెట్టు ఆటోపై కూలింది. దీంతో చోదకుడు రొంగళి మహేష్(30), జునపాల సింహాచలం(32) అనే మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆండ్ర బస్టాండ్ దరిలో నివాసముంటున్న తామరాపల్లి రాజ్యలక్ష్మికి స్వల్ప గాయాలు కాగా.. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులతో పాటు, సమీప ప్రాంతాలవాసులు పరుగున వచ్చి వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు. ఆటో నుజ్జునుజ్జవడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకొని ఆండ్ర ఎస్ఐ సుదర్శనరావు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గజపతినగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు.
తల్లి, చెల్లితో వెళ్లి..
ఈ ప్రమాదంలో కొండపర్తి బాడవకు చెందిన సింహాచలం మృతి చెందారు. ఈమెకు భర్త మహేష్, ఇద్దరు అబ్బాయిలున్నారు. రోజూ భర్తతో కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం తల్లి పొయిరి అచ్చమ్మ, సోదరితో కలిసి పిట్టాడ వెళ్లారు. సింహాచలం మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
ఆదుకుంటాడనుకుంటే..
పిట్టాడకు చెందినఆర్.మహేష్ తల్లిదండ్రులు మంగమ్మ, సత్యం వ్యవసాయ కూలీలు. అతని సోదరికి వివాహం కాగా.. మహేష్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూలీలను దించి వస్తానని చెప్పి, విగతజీవిగా తిరిగి వచ్చాడని ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఆదుకుంటాడనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోయాడని విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా