రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి... తల్లిదండ్రులకు గాయాలు
తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి కావడి మొక్కు చెల్లించి కారులో వస్తున్న ఒకే కుటుంబసభ్యులు షోలింగర్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురుకి గాయాలవగా.. ఒకరు మరణించారు. గాయపడిన వారు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స
తిరుత్తణిలో కావడి మొక్కు చెల్లించి వస్తుండగా ఘటన
రవితేజ (పాతచిత్రం)
బంగారుపాళ్యం: తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి కావడి మొక్కు చెల్లించి కారులో వస్తున్న ఒకే కుటుంబసభ్యులు షోలింగర్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురుకి గాయాలవగా.. ఒకరు మరణించారు. గాయపడిన వారు వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెదేపా మండల మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపిన సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివెంకటగిరి గ్రామానికి జగదీష్, అతడి భార్య మాధవి, కుమారుడు రవితేజ, కుమారై యామిని, జగదీష్ చెల్లెలు వాణి, ఆమె కుమారై ప్రియ సోమవారం తమిళనాడులోని తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కు చెల్లించేందుకు కారులో పయనమయ్యారు. మొక్కు చెల్లించి తిరిగి వస్తుండగా షోలింగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం నుంచి ప్రమాదాన్ని తప్పించబోయి పక్కకు తిప్పడంతో కారు అదుపు తప్పి రహదారిలో కల్వర్టును ఢీకొంది. ప్రమాదంలో రవితేజ(21) మృతి చెందాడు. అతడు హైదరాబాదు నుంచి స్వామివారి మొక్కుచెల్లించడానికి వచ్చాడు. అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుడి తండ్రి జగదీష్, తల్లి మాధవి, చెల్లెలు యామిని, అత్త వాణి, ఆమె కుమారై ప్రియకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మొగిలి వెంకటగిరి గ్రామంలో విషదఛాయలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!